Webdunia - Bharat's app for daily news and videos

Install App

జెరూసలెంను ఇజ్రాయేల్ రాజధానిగా గుర్తించాలి.. గాజాలో ఘర్షణ.. 40మంది మృతి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జెరూసలెంను ఇజ్రాయేల్ రాజధానిగా గుర్తించాలని వివాదస్పద ప్రకటన చేశారు. అంతేగాకుండా.. జెరూసలెంను ఇజ్రాయేల్ రాజధానిగా గుర్తించడం అనేది.. తమ వద్ద దీర్ఘకాలికంగా పెండింగ్‌ల

Webdunia
మంగళవారం, 15 మే 2018 (14:57 IST)
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జెరూసలెంను ఇజ్రాయేల్ రాజధానిగా గుర్తించాలని వివాదస్పద ప్రకటన చేశారు. అంతేగాకుండా.. జెరూసలెంను ఇజ్రాయేల్ రాజధానిగా గుర్తించడం అనేది.. తమ వద్ద దీర్ఘకాలికంగా పెండింగ్‌లో వున్న అంశమని ట్రంప్ వ్యాఖ్యానించారు. అంతేగాకుండా  జెరూసలెంకు అమెరికా తన ఎంబసీని తరలిస్తోంది. కానీ ఈ చర్యకు వ్యతిరేకంగా గాజా సరిహద్దులో ఆందోళనలు మిన్నంటాయి. 
 
సరిహద్దు కంచెను తొలగించేందుకు పాలస్తీనీయులు ప్రయత్నించడంతో ఆందోళన కారులపై ఇజ్రాయెల్‌ సైన్యం భీకరంగా కాల్పులు జరిపింది. దీంతో సుమారు 40మంది నిరసన కారులు అక్కడికక్కడే మరణించారు. వెయ్యి మందికిపైగా గాయపడ్డారు. ట్రంప్‌ చర్య మధ్యప్రాచ్యంలో మరో తేనెతుట్టను కదిలించినట్టు ఉందని విశ్లేషకులు అంటున్నారు.          
 
కాగా, 1967లో జరిగిన యుద్ధం తరువాత తూర్పు జెరూసలెంను జోర్డాన్‌ దేశం నుంచి ఇజ్రాయెల్‌ స్వాధీనం చేసుకుంది. అనంతరం అవిభాజ్య జెరూసలెంను ఇజ్రాయెల్ తమ రాజధానిగా భావిస్తూ వస్తున్నప్పటికీ ప్రపంచ దేశాలు జెరూసలెంను ఆ దేశ రాజధానిగా గుర్తించలేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మజాకా సెన్సార్ పూర్తి- యూ/ఏ సర్టిఫికేట్ ఇచ్చిన బోర్డ్

సకెస్స్ కోసం రెండు సినిమాల షూటింగ్ లు చేస్తున్న రవితేజ

పోలీసులు అరెస్టు చేయలేదు : మంచు మనోజ్

పవన్ ఫ్యాన్స్‌కు శుభవార్త చెప్చిన నిర్మాత ఏఎం రత్నం.. ఏంటది?

రామ్ చరణ్ కు బదులు విజయ్ దేవరకొండ కు చాన్స్ వచ్చిందా ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లలు వ్యాయామం చేయాలంటే.. ఈ చిట్కాలు పాటించండి

Garlic: పరగడుపున వెల్లుల్లిని నమిలి తింటే? చర్మం మెరిసిపోతుంది..

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

తర్వాతి కథనం
Show comments