Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ ఇంట్లో గాజు సీసాలు.. వాటిలో పేగు తెగని శిశువులు.. ఎక్కడ?

జపాన్‌లోని ఓ గృహంలో దిగ్భ్రాంతికి గురిచేసే విషయాలు వెలుగులోకి వచ్చాయి. వివరాల్లోకి వెళితే.. జపాన్ నగరంలోని ఓ గృహానికి మరమ్మత్తు పనులు జరుగుతున్నాయి. ఆ సమయంలో ఇంటి నేలకు కింద పూడ్చిపెట్టబడిన గాజు సీసాల

Webdunia
మంగళవారం, 13 మార్చి 2018 (19:01 IST)
జపాన్‌లోని ఓ గృహంలో దిగ్భ్రాంతికి గురిచేసే విషయాలు వెలుగులోకి వచ్చాయి. వివరాల్లోకి వెళితే.. జపాన్ నగరంలోని ఓ గృహానికి మరమ్మత్తు పనులు జరుగుతున్నాయి. ఆ సమయంలో ఇంటి నేలకు కింద పూడ్చిపెట్టబడిన గాజు సీసాల్లో శిశువుల మృతదేహాలుండటంతో అందరూ షాకయ్యారు. జపాన్, టోక్యానగరంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. 
 
టోక్యాలో గత మూడేళ్ల పాటు ఎవ్వరూ ఉపయోగించని ఓ డాక్టర్ గృహాన్ని ఓ వ్యక్తి కొనుగోలు చేశాడు. కొనుగోలు చేసిన ఆనందంలో ఇంటికి మరమ్మతు పనులు చేపట్టాడు. ఈ క్రమంలో మరమ్మత్తు పనుల్లో నిమగ్నమైన కార్మికులు నేలకు కింద పూడ్చిన గాజు సీసాలను వెలికి తీశారు.
 
ఆ గాజు సీసాల్లో పేగు కూడా తెగని శిశువుల మృతదేహాలుండటాన్ని చూసి షాక్ అయ్యారు. ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి గాజు సీసాలను స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేపట్టారు. శిశువుల మృతదేహాలను ఎవరు అలా ప్రిజర్వ్ చేశారనే దానిపై జపాన్ పోలీసులు తీవ్రస్థాయిలో విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Lakshmi Manchu: కళను రాజకీయం చేయవద్దు... మంచు లక్ష్మీ కామెంట్స్

హోంబలే ఫిల్మ్స్ ఏడు ఎపిక్ ఫిలిమ్స్‌ లో తొలిగా నరసింహ సాంగ్ రిలీజ్

రైతు పోరాటం, మాదకద్రవ్యాల నేపథ్యంతో వీడే మన వారసుడు చిత్రం

Varsha bollamma: కానిస్టేబుల్ కనకం కథ కాపీ కొట్టడంపై కోర్టులో కేసు

Bhagyashri Borse: అక్కినేని అఖిల్ లెనిన్ సినిమా.. శ్రీలీల అవుట్.. భాగ్యశ్రీ బోర్సే ఇన్.. నిజమేనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

దివ్యాంగ విద్యార్ధుల కోసం నాట్స్ ఉచిత బస్సు, విశాఖలో బస్సును లాంఛనంగా ప్రారంభించిన ఎంపీ భరత్

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

నేరేడు పండ్లు తింటే 8 ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments