సామాన్యుడిని పెళ్లి చేసుకున్న జపాన్ యువరాణి

Webdunia
బుధవారం, 27 అక్టోబరు 2021 (10:43 IST)
సామాన్యుడిని పెండ్లి చేసుకోనున్నట్టు జపాన్‌ యువరాణి మకో ఇప్పటికే ప్రకటించారు. ఆమె ప్రకటించినట్టుగానే తాజాగా తన మూడేండ్ల ప్రేమకు గెలుపుతో ముగింపు పలికారు. సామాన్యుడైన కీ కొమురోతో జపాన్‌ యువరాణి మకో వివాహం ఘనంగా జరిగింది. ఈ మేరకు జపాన్‌ రాజసౌధం ఇంపీరియల్‌ హౌస్‌హోల్డ్‌ ఏజెన్సీ తెలిపింది. 
 
యువరాణి మకో.. భర్త ఇంటిపేరునే తన ఇంటిపేరుగా మార్చుకున్నట్టు వివరించింది. అలాగే, రాజభరణం కింద తనకు వచ్చే రూ.9.19 కోట్లు (140 మిలియన్‌ యెన్‌లు) మొత్తాన్ని కూడా తిరస్కరించినట్టు తెలిపింది. అలాగే, ఒక సాధారణ పౌరుడిని పెళ్ళి చేసుకోవడంతో మకో యువరాణి హోదాను కోల్పోయి సామాన్య పౌరురాలిగా మారిపోయారు. 
 
కాగా, జపాన్‌ చక్రవర్తి నరుహిటో సోదరుడి కుమార్తె మకో. టోక్యో ఇంటర్నేషనల్‌ క్రిస్టియన్‌ యూనివర్శిటీలో చదువుకునే సమయంలో ఆమె కొమురోను ఇష్టపడ్డారు. పెళ్లి చేసుకోబోతున్నట్టు 2017లోనే ఈ జంట ప్రకటించినప్పటికీ.. కుటుంబ, ఆర్థిక సమస్యల కారణంగా ముందుకు వెళ్లలేదు. తాజాగా ఇరు కుటుంబాలు అంగీకరించడంతో ఇద్దరూ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలంకకు మానవతా సాయం... కాలం చెల్లిన ఆహారాన్ని పంపిన పాకిస్థాన్

డేట్స్ లేకపోయినా అడ్జెస్ట్ చేసుకుని అఖండలో నటించా : సంయుక్తా

Sri Nandu: డెమో లాగా సైక్ సిద్ధార్థ షూట్ చేస్తే ఓటీటీ నుంచి ఆఫర్ వచ్చింది : శ్రీ నందు

Boman Irani: రాజా సాబ్ నుంచి బొమన్ ఇరానీ బర్త్ డే పోస్టర్

బాలకృష్ణ 'అఖండ-2'కు టిక్కెట్ ధరలు పెంపు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments