Webdunia - Bharat's app for daily news and videos

Install App

భూకంపాలను తట్టుకునేలా బుల్లెట్ రైలు.. గంటకు 360 కిమీ వేగంతో పరుగు

Webdunia
శనివారం, 25 మే 2019 (17:35 IST)
జపాన్ బుల్లెట్ రైల్ సరికొత్త రికార్డును సృష్టించింది. గంటకు 360 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లింది. తాజాగా నిర్వహించిన టెస్ట్ డ్రైవ్‌లో ఎన్.700 సుప్రీం అనే పేరు పెట్టిన బుల్లెట్ రైలు జెట్ స్పీడ్ వేగంతో దూసుకెళ్లి ఔరా అనిపించింది. 
 
పైగా, ఈ సుప్రీం బుల్లెట్ రైలును తక్కువ బరువుతో పాటు.. తక్కువ ఇంధన వినియోగంతో తయారు చేశారు. ముఖ్యంగా, జపాన్ దేశంలో భూకంపలు తరచూ సంభవిస్తాయన్న నేపథ్యంలో, భూకంపాలను తట్టుకునే విధంగా నిర్మాణంలో అనేక జాగ్రత్తలు తీసుకున్నారు.
 
కాగా, సెంట్రల్ జపాన్ రైల్వే కార్పొరేషన్ దీన్ని ప్రయోగాత్మకంగా మయబరా, క్యోటో నగరాల మధ్య నడిపి చూసింది. అత్యధికంగా 360 కిమీ వేగం అందుకున్నట్టు గుర్తించారు. బుల్లెట్ షింకాన్సెన్ రైళ్లలో ఇప్పటివరకు ఇదే అత్యధిక వేగం అని జపాన్ రైల్వే వర్గాలు తెలిపాయి. జపాన్ లో 1964 నుంచి బుల్లెట్ రైళ్లు వినియోగంలో ఉన్నాయి.
 
కాగా, జపాన్ సహకారంతో భారత్ కూడా బుల్లెట్ రైల్‌ ప్రాజెక్టును చేపట్టిన విషయం తెల్సిందే. ఈ రైలు ఢిల్లీ - అహ్మాదాబాద్‌ల మధ్య నడుపనున్నారు. ఈ ప్రాజెక్టుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇప్పటికే శంకుస్థాపన చేసిన విషయం తెల్సిందే.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments