Webdunia - Bharat's app for daily news and videos

Install App

భూకంపాలను తట్టుకునేలా బుల్లెట్ రైలు.. గంటకు 360 కిమీ వేగంతో పరుగు

Webdunia
శనివారం, 25 మే 2019 (17:35 IST)
జపాన్ బుల్లెట్ రైల్ సరికొత్త రికార్డును సృష్టించింది. గంటకు 360 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లింది. తాజాగా నిర్వహించిన టెస్ట్ డ్రైవ్‌లో ఎన్.700 సుప్రీం అనే పేరు పెట్టిన బుల్లెట్ రైలు జెట్ స్పీడ్ వేగంతో దూసుకెళ్లి ఔరా అనిపించింది. 
 
పైగా, ఈ సుప్రీం బుల్లెట్ రైలును తక్కువ బరువుతో పాటు.. తక్కువ ఇంధన వినియోగంతో తయారు చేశారు. ముఖ్యంగా, జపాన్ దేశంలో భూకంపలు తరచూ సంభవిస్తాయన్న నేపథ్యంలో, భూకంపాలను తట్టుకునే విధంగా నిర్మాణంలో అనేక జాగ్రత్తలు తీసుకున్నారు.
 
కాగా, సెంట్రల్ జపాన్ రైల్వే కార్పొరేషన్ దీన్ని ప్రయోగాత్మకంగా మయబరా, క్యోటో నగరాల మధ్య నడిపి చూసింది. అత్యధికంగా 360 కిమీ వేగం అందుకున్నట్టు గుర్తించారు. బుల్లెట్ షింకాన్సెన్ రైళ్లలో ఇప్పటివరకు ఇదే అత్యధిక వేగం అని జపాన్ రైల్వే వర్గాలు తెలిపాయి. జపాన్ లో 1964 నుంచి బుల్లెట్ రైళ్లు వినియోగంలో ఉన్నాయి.
 
కాగా, జపాన్ సహకారంతో భారత్ కూడా బుల్లెట్ రైల్‌ ప్రాజెక్టును చేపట్టిన విషయం తెల్సిందే. ఈ రైలు ఢిల్లీ - అహ్మాదాబాద్‌ల మధ్య నడుపనున్నారు. ఈ ప్రాజెక్టుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇప్పటికే శంకుస్థాపన చేసిన విషయం తెల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Modi: మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు - మోదీ, చంద్రబాబుకు ధన్యవాదాలు : పవన్ కళ్యాణ్ (video)

NTR: ఎన్.టి.ఆర్., ప్రశాంత్ నీల్ చిత్రం డ్రాగన్ అప్ డేట్

Akhil: పుట్టేటప్పుడు పేరు ఉండదు. పోయేటప్పుడు ఊపిరి ఉండదు - అఖిల్.. లెనిన్ గ్లింప్స్

Prabhas: రాజాసాబ్ రిలీజ్ కోసం తిరుపతి, శ్రీకాళహస్తి ఆలయాలను దర్శించిన మారుతి

Vijayashanti : కళ్యాణ్ రామ్, విజయశాంతి పై ముచ్చటగా బంధాలే.. పాట చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments