Webdunia - Bharat's app for daily news and videos

Install App

జపాన్‌పై ప్రకృతి కన్నెర్ర చేసింది.. వరదల్లో 100 మంది మృతి..

జపాన్‌పై ప్రకృతి కన్నెర్ర చేసింది. కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు జపాన్‌ను అతలాకుతలం చేస్తున్నాయి. 2004 తర్వాత జపాన్‌లో మళ్లీ ఇంతటి తీవ్ర స్థాయిలో వరదలు సంభవించడం ఇదే తొలిసారని జపాన్ ప్రభుత్

Webdunia
సోమవారం, 9 జులై 2018 (12:49 IST)
జపాన్‌పై ప్రకృతి కన్నెర్ర చేసింది. కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు జపాన్‌ను అతలాకుతలం చేస్తున్నాయి. 2004 తర్వాత జపాన్‌లో మళ్లీ ఇంతటి తీవ్ర స్థాయిలో వరదలు సంభవించడం ఇదే తొలిసారని జపాన్ ప్రభుత్వాధికారులు తెలిపారు. 
 
తాజాగా భారీ వర్షాల కారణంగా మృతిచెందిన వారి సంఖ్య వందకు చేరుకున్నట్లు జపాన్ సర్కారు వెల్లడించింది. వీరిలో 87 మందిని గుర్తించారు. అనేకమంది గల్లంతయ్యారు. దీంతో సహాయక సిబ్బంది సహాయక చర్యలను ముమ్మరం చేస్తున్నారు. 
 
గత గురువారం నుంచి జపాన్‌లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. వందల సంఖ్యలో ఇళ్లు నీటమునిగాయి. వాహనాలు కొట్టుకుపోతున్నాయి. దీంతో ప్రజలు ఇళ్లపైకి ఎక్కి సాయం కోసం ఎదురుచూస్తున్నారు. రంగంలోకి దిగిన జపాన్‌ సైన్యం.. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయకచర్యలు చేపట్టింది. 
 
పడవల సాయంతో ప్రజలను రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మరోవైపు వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడటంతో కొన్ని చోట్ల వంతెనలు కూలిపోయాయి. రహదారులు ధ్వంసమయ్యాయి. సహాయకచర్యల కోసం హెలికాప్టర్లను రంగంలోకి దించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం