Webdunia - Bharat's app for daily news and videos

Install App

జపాన్‌పై ప్రకృతి కన్నెర్ర చేసింది.. వరదల్లో 100 మంది మృతి..

జపాన్‌పై ప్రకృతి కన్నెర్ర చేసింది. కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు జపాన్‌ను అతలాకుతలం చేస్తున్నాయి. 2004 తర్వాత జపాన్‌లో మళ్లీ ఇంతటి తీవ్ర స్థాయిలో వరదలు సంభవించడం ఇదే తొలిసారని జపాన్ ప్రభుత్

Webdunia
సోమవారం, 9 జులై 2018 (12:49 IST)
జపాన్‌పై ప్రకృతి కన్నెర్ర చేసింది. కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు జపాన్‌ను అతలాకుతలం చేస్తున్నాయి. 2004 తర్వాత జపాన్‌లో మళ్లీ ఇంతటి తీవ్ర స్థాయిలో వరదలు సంభవించడం ఇదే తొలిసారని జపాన్ ప్రభుత్వాధికారులు తెలిపారు. 
 
తాజాగా భారీ వర్షాల కారణంగా మృతిచెందిన వారి సంఖ్య వందకు చేరుకున్నట్లు జపాన్ సర్కారు వెల్లడించింది. వీరిలో 87 మందిని గుర్తించారు. అనేకమంది గల్లంతయ్యారు. దీంతో సహాయక సిబ్బంది సహాయక చర్యలను ముమ్మరం చేస్తున్నారు. 
 
గత గురువారం నుంచి జపాన్‌లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. వందల సంఖ్యలో ఇళ్లు నీటమునిగాయి. వాహనాలు కొట్టుకుపోతున్నాయి. దీంతో ప్రజలు ఇళ్లపైకి ఎక్కి సాయం కోసం ఎదురుచూస్తున్నారు. రంగంలోకి దిగిన జపాన్‌ సైన్యం.. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయకచర్యలు చేపట్టింది. 
 
పడవల సాయంతో ప్రజలను రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మరోవైపు వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడటంతో కొన్ని చోట్ల వంతెనలు కూలిపోయాయి. రహదారులు ధ్వంసమయ్యాయి. సహాయకచర్యల కోసం హెలికాప్టర్లను రంగంలోకి దించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అడివి శేష్ పాన్-ఇండియన్ థ్రిల్లర్ డకాయిట్ ఫైర్ థీమ్ రిలీజ్

దేవిక అండ్ డానీ వంటి వెబ్ సిరీస్ చేయ‌టం నా అదృష్టం : హీరోయిన్ రీతూవ‌ర్మ‌

పవన్ కళ్యాణ్ "హరిహర వీరమల్లు" చిత్రం మళ్లీ వాయిదానా?

Tarun Bhaskar: నాన్న కి కో వస్తే కామన్ గా తిట్టే పదం బద్మాష్ : తరుణ్ భాస్కర్

Rana: నాయుడు కుటుంబం ఏ ప‌నిని అసంపూర్తిగా చేయ‌దు అనేదే రానా నాయుడు సీజ‌న్‌2

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం