Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇమ్రాన్ జీ.. పుల్వామా ఉగ్రదాడి మా పనే : జైషే మహమ్మద్

Webdunia
బుధవారం, 20 ఫిబ్రవరి 2019 (11:46 IST)
పుల్వామా ఉగ్రదాడి వెనుక పాకిస్థాన్ హస్తముందంటూ భారత్ నిరాధార ఆరోపణలు చేస్తోందని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యానించి కొన్ని గంటలు కాకముందే తీవ్రవాద సంస్థ జైష్ మహహ్మద్ తేరుకోలేని ఝులక్ ఇచ్చింది. పుల్వామా ఉగ్రదాడి తమపనేనంటూ రెండో వీడియో ఆధారాన్ని విడుదల చేసింది. 
 
పైగా, ఇమ్రాన్ ఖాన్ అడుగుతున్న అన్ని రకాల ఆధారాలను వీడియో ద్వారా బయటపెట్టి.. సాక్ష్యాలను తనకు తానే అందించింది. పుల్వామా ఉగ్రదాడి తమ పనే అంటూ రెండో వీడియోను మంగళవారం విడుదల చేసింది. అంతేకాదు ఎప్పుడు కావాలంటే అప్పుడు దాడి చేయడానికి తాము ఎప్పుడూ సిద్ధమేనని వీడియోలో పేర్కొనడం గమనర్హం. ఈ వీడియోతో ఇమ్రాన్ ఖాన్ ఇపుడు డైలామాలో పడ్డారు. 
 
కాగా, పుల్వామా ఉగ్రదాడి జరిగిన నాలుగు రోజుల తర్వాత ఇమ్రాన్ ఖాన్ మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు. పుల్వామా ఉగ్రదాడికి తమకు ఎలాంటి సంబంధంలేదని, ఒక దేశంలో మరో దేశం ఇలాంటి ఆరోపణలు చేయడం భావ్యం కాదని వ్యాఖ్యానించారు. తమ దేశం కూడా స్వయంగా ఉగ్ర బాధిత దేశమేనని వాపోయారు. తమపై నిందలు వేస్తున్న భారత్.. పుల్వామా ఉగ్రదాడికి సంబంధించి రుజువులు ఉంటే చూపాలని పదే పదే కోరారు. ఈ వ్యాఖ్యలు చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే జైషే... దాడులు తమ పనే అంటూ రెండో వీడియో విడుదల చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

Ambedkar: అగ్రహారంలో అంబేద్కర్ సినిమా ఫస్ట్ లుక్

బుట్టబొమ్మకు తెలుగులో తగ్గిన అవకాశాలు.. బాలీవుడ్‌లో ఛాన్సులు...

పుష్పక విమానం టాకీ అయితే అది సారంగపాణి జాతకం : వెన్నెల కిషోర్

8కె. ఫార్మెట్ లో ఎన్.టి.ఆర్., రాజమౌళి సినిమా యమదొంగ రిరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments