Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌పై దండయాత్ర చేసేందుకు అనుమతివ్వండి : జైషే మొహ్మద్ చీఫ్

భారత్‌ ఆర్మీ జరిపిన సర్జికల్ దాడులకు ప్రతీకారం తీర్చుకునేందుకు వీలుగా ప్రతీకార దాడులు చేసేందుకు తమకు అనుమతి ఇవ్వాలంటూ పాకిస్థాన్ ప్రభుత్వాన్ని జైషే మొహ్మద్ చీప్ మసూద్ అజహార్ కోరారు. భారత సైనిక స్థావరా

Webdunia
గురువారం, 13 అక్టోబరు 2016 (11:43 IST)
భారత్‌ ఆర్మీ జరిపిన సర్జికల్ దాడులకు ప్రతీకారం తీర్చుకునేందుకు వీలుగా ప్రతీకార దాడులు చేసేందుకు తమకు అనుమతి ఇవ్వాలంటూ పాకిస్థాన్ ప్రభుత్వాన్ని జైషే మొహ్మద్ చీప్ మసూద్ అజహార్ కోరారు. భారత సైనిక స్థావరాలపై దాడులను జరిపేందుకు తమను అనుమతించాలని కోరారు. 
 
జైషే వార పత్రిక 'అల్ కాలామ్'లో ఆయన ఓ కథనాన్ని రాశాడు. ఇందులో కాశ్మీర్ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించాడు. కాశ్మీర్‌ను పూర్తిగా ఆక్రమించుకునేలా చారిత్రక అవకాశం ఇప్పుడు పాకిస్థాన్ చేతుల్లో ఉందని, నిర్ణయం తీసుకోవడం ఆలస్యమైతే అవకాశం చేజారుతుందన్నాడు. 
 
భారత్ జరిపిన సర్జికల్ దాడుల నేపథ్యంలో ప్రతీకారం తీర్చుకునే అవకాశం కల్పించాలని, అందుకు కాశ్మీర్‌ను కానుకగా తెచ్చిస్తామని ఆయన అన్నట్టు తెలుస్తోంది. కొంచెం ధైర్యం చూపితే కాశ్మీర్ సమస్య, నీటి వివాదాలు తొలగిపోతాయని, ముజాహిద్దీన్లకు దారివ్వాలని, ఆపై ఏం జరుగుతుందన్నది దేవుడి దయగా మసూద్ అజర్ వ్యాఖ్యానించినట్టు పత్రిక తెలిపింది. 

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments