Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికాలో ఇండియన్ టెక్కీలకు ట్రంప్ షాక్... రూ.87,00,000 జీతం వుంటేనే... లేదంటే పొండి...

డొనాల్డ్ ట్రంప్ అనుకున్నట్లే అమెరికాలోని ఎన్నారైలను ఖాళీ చేయించే దిశగా అడుగులు వేస్తున్నారు. హెచ్1 బి వీసాలతో అమెరికాలో ఉద్యోగం చేసేవారి వార్షిక వేతనం రూ. 87,00,000 వుంటేనే అమెరికాలో వుండేట్లు చట్టం తీసుకురాబోతున్నారు. ఈ బిల్లు దాదాపు ఆమోదం పొందే అవక

Webdunia
మంగళవారం, 31 జనవరి 2017 (13:52 IST)
డొనాల్డ్ ట్రంప్ అనుకున్నట్లే అమెరికాలోని ఎన్నారైలను ఖాళీ చేయించే దిశగా అడుగులు వేస్తున్నారు. హెచ్1 బి వీసాలతో అమెరికాలో ఉద్యోగం చేసేవారి వార్షిక వేతనం రూ. 87,00,000 వుంటేనే అమెరికాలో వుండేట్లు చట్టం తీసుకురాబోతున్నారు. ఈ బిల్లు దాదాపు ఆమోదం పొందే అవకాశం వున్నట్లు తెలుస్తోంది. ఇదే కనుక జరిగితే అక్కడ నివాసముంటున్న ఎన్నారైలకు పెద్ద దెబ్బే. అంతా ఇండియాకు తిరుగు ప్రయాణం కట్టాల్సి వుంటుంది. 
 
అమెరికాలో ఉద్యోగం, జీవితం అనేది వార్షిక వేతనం దాదాపు కోటి రూపాయల దాకా వున్నవారికే సాధ్యం. కాబట్టి అమెరికాలో అంత భారీ మొత్తంలో జీతాలు ఇస్తే దిగ్గజ కంపెనీలైన ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో తదితర కంపెనీలు భారీ నష్టాలను చవిచూడక తప్పదు. ఐటీ కంపెనీల్లో పనిచేస్తున్న భారతీయులకు శరాఘాతంగా మారుతుంది. 
 
మరోవైపు ట్రంప్ తన నిర్ణయాన్ని ప్రకటించగానే భార‌త ఐటీ దిగ్గ‌జ కంపెనీలు ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌, విప్రో, హెచ్‌సీఎల్, టెక్ మ‌హీంద్రా షేర్లు 9 శాతం మేర నష్టాలు చవిచూశాయి. ఇక మ‌ధ్య‌స్థాయి ఐటీ కంపెనీల షేర్లు దారుణంగా కుప్పకూలాయి. గమనించాల్సిన విషయం ఏమంటే... బీఎస్ఈలో 4 శాతం న‌ష్టంతో ఎక్కువ న‌ష్టాన్ని మూటగట్టుకున్నది ఐటీ రంగం కావడం. మున్ముందు ట్రంప్ మరెన్ని షాకులిస్తారో వేచి చూడాల్సిందే.

ఎం.ఎల్.ఎ.లను కిడ్నాప్ చేసిన రామ్ చరణ్ - తాజా అప్ డేట్

దేవర లో 19 న ఎర్రసముద్రం ఎగిసెగిసిపడుద్ది : రామ జోగయ్యశాస్త్రి

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments