Webdunia - Bharat's app for daily news and videos

Install App

చర్యకు ప్రతిచర్య : గూఢచర్యం ఆరోపణలపై భారత్ దౌత్యాధికారిని బహిష్కరించిన పాక్

పాకిస్థాన్ ప్రతీకారం తీర్చుకుంది. గూఢచర్యం కేసులో ఢిల్లీలోని పాక్ హైకమిషన్ కార్యాలయంలో పని చేసే దౌత్య సిబ్బందిని భారత ప్రభుత్వం బహిష్కరించింది. ఆ తర్వాత ఇదే ఆరోపణల కింద పాకిస్థాన్ భారత దౌత్యాధికారిని

Webdunia
శుక్రవారం, 28 అక్టోబరు 2016 (09:53 IST)
పాకిస్థాన్ ప్రతీకారం తీర్చుకుంది. గూఢచర్యం కేసులో ఢిల్లీలోని పాక్ హైకమిషన్ కార్యాలయంలో పని చేసే దౌత్య సిబ్బందిని భారత ప్రభుత్వం బహిష్కరించింది. ఆ తర్వాత ఇదే ఆరోపణల కింద పాకిస్థాన్ భారత దౌత్యాధికారిని తమ దేశం వీడి వెళ్లిపోవాల్సిందిగా ఆదేశించింది. 
 
న్యూఢిల్లీలోని పాక్ హైకమిషన్ ఆఫీసులో పనిచేస్తున్న మహ్మూద్ అఖ్తర్ (35)ను 48 గంటల్లోగా దేశం విడిచి పోవాలని భారత్ ఆదేశించిన సంగతి తెలిసిందే. రాజస్థాన్ నుంచి వచ్చిన ఇద్దరిని ఢిల్లీ జూపార్కు వద్ద కలుసుకున్న ఆయన, సైన్యానికి సంబంధించిన రహస్య సమాచారమున్న పత్రాలను స్వీకరిస్తుంటే పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. దీంతో ఆయనను దేశం వీడి వెళ్లాల్సిందిగా ఆదేశించింది. 
 
ఈ వార్త వెలువడిన కొన్ని గంటల్లోనే పాకిస్థాన్‌లోని భారత కాన్సులేట్‌లో పనిచేస్తున్న సుర్జీత్ సింగ్‌పై వేటు వేసింది. శుక్రవారం సాయంత్రంలోగా సుర్జీత్ తన కుటుంబంతో సహా దేశాన్ని విడిచిపోవాలని ఆదేశించింది. వియన్నా సదస్సు నిర్ణయాలు, ద్వైపాక్షిక నిబంధనలకు విరుద్ధంగా ఆయన ప్రవర్తిస్తున్నాడని చెబుతూ భారత హై కమిషనర్‌కు సమన్లు పంపింది. ఆయన్ను వెంటనే ఇండియాకు పంపేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించింది. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments