Webdunia - Bharat's app for daily news and videos

Install App

గాజాలో వైమానికదాడి.. 22 మంది చిన్నారులతో సహా 48 మంది మృతి

ఠాగూర్
బుధవారం, 14 మే 2025 (15:55 IST)
ఇజ్రాయెల్ - హమాస్‌ మధ్య జరుగుతున్న ఘర్షణలతో గాజా ప్రాంతం మరోసారి దాడులతో దద్ధరిల్లిపోతోంది. ఉత్తర గాజాలోని నివాస ప్రాంతాలపై మంగళవారం రాత్రి ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడులు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. ఈ దాడుల్లో పెద్ద సంఖ్యలో పౌరులు ప్రాణాలు కోల్పోయారు. 
 
ఉత్తర గాజాలోని జాబిలియా ప్రాంతంలో ఇళ్లపై వైమానిక దాడులు జరిగాయి. ఈ దుర్ఘటనలో 48 మంది పౌరులు మరణించగా వారిలో 22 మంది చిన్నారులు కూడా ఉన్నారని స్థానిక ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. అనేక నివాస భవనాలు ఈ దాడుల్లో తీవ్రంగా దెబ్బతిన్నాయని తెలిపారు. అమెరికా మధ్యవర్తిత్వంతో జరిగిన ఒప్పందంలో భాగంగా హమాస్ ఒక ఇజ్రాయెల్ అమెరికన్ బందీని విడుదల చేసిన కొద్దిసేపటికే ఈ దాడులు జరగడం గమనార్హం 
 
మరోవైపు, గాజాలా యుద్ధాన్ని ఆపే ప్రసక్తే లేదని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజిమిన్ నెతన్యాహు స్పష్టం చేశారు. దీంతో యుద్ధ విరమణ ఒప్పందంపై నెలకొన్న ఆశలు సన్నగిల్లాయి. ఇటీవల ఇజ్రాయెల్ హుతీలు జరిపిన దాడుల పట్ల నెతన్యాహు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments