Webdunia - Bharat's app for daily news and videos

Install App

గాజా ఆస్పత్రిలో పేలుడు... 500 మంది మృత్యువాత

Webdunia
బుధవారం, 18 అక్టోబరు 2023 (10:11 IST)
హమాస్ ఉగ్రవాదులు చేసిన రాకెట్ దాడులకు ప్రతిగా ఇజ్రాయెల్ సైన్యం భీకర దాడులు చేస్తుంది. ముఖ్యంగా, హమాస్ ఉగ్రవాదులకు మంచి పట్టుున్న గాజాలో రాకెట్‌ దాడులతో విరుచుకుపడుంది. తాజాగా గాజాలోని ఓ ఆస్పత్రిలో జరిగిన పేలుడుధాటికి 500 మంది వరకు చనిపోయారు. ఇజ్రాయెల్ దాడి వల్లే ఈ ఘోరం జరిగిందని హమాస్ ఆరోపిస్తుంది. 
 
గాజాలో ఎన్నడూలేని విధంగా ఆసుపత్రిలో పేలుడసంభవించి 500 మంది మరణించినట్లు సమాచారం. దీనికి ఇజ్రాయెల్ వైమానిక దాడులే కారణమని హమాస్ ఆరోపిస్తోంది. గాజా సిటీలోని అల్ అహ్లి ఆసుపత్రిలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుందని తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే దశాబ్దాలుగా జరుగుతున్న ఇజ్రాయెల్, పాలస్తీనా ఘర్షణల్లో ఇదే అతి పెద్ద దారుణ ఘటన అవుతుంది. 
 
మరోవైపు ఉత్తర గాజాలో ఉన్న ప్రజలంతా దక్షిణ గాజాకు వెళ్లాలని ఆదేశించిన ఇజ్రాయెల్ అక్కడా బాంబు దాడులు చేస్తోంది. మంగళవారం దక్షిణ గాజాపై చేసిన దాడుల్లో డజన్ల సంఖ్యలో పాలస్తీనా వాసులు మరణించారు. వారిలో ఉత్తర గాజా నుంచి వలస వచ్చిన వారూ ఉన్నారు. ఇటు లెబనాన్ సరిహద్దులోనూ మంగళవారం ఇజ్రాయెల్, హెజొ‌బొల్లా మధ్య ఘర్షణ జరిగింది. తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న గాజాకు సాయం అందించడానికి మధ్యవర్తుల ప్రయత్నాలు సాగుతూనే ఉన్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

VN Aditya: ఫెడరేషన్ నాయకులను మారిస్తే సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయి : VN ఆదిత్య

వాళ్లు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తారు... మేము ఎడ్యుకేట్ చేస్తాం : ఏఆర్ మురుగదాస్

రీ రిలీజ్‌కు సిద్దమైన 'స్టాలిన్' మూవీ

పవన్ కళ్యాణ్ ఓ పొలిటికల్ తుఫాను : రజనీకాంత్

వీధి కుక్కలను చంపవద్దు అంటే ఎలా? దత్తత తీసుకోండి.. హ్యాష్ ట్యాగ్ సృష్టించండి.. వర్మ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments