ఇరాక్పై అగ్రరాజ్యం అమెరికా చేస్తున్న వైమానిక దాడులకు నిరసనగా 2012లో సిరియాలో కిడ్నాప్ చేసిన అమెరికా జర్నలిస్టు జేమ్స్ ఫోలేను ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు అత్యంత కిరాతకంగా హతమార్చారు. ఒక ఎడారి ప్రాంతానికి తీసుకెళ్లిన తీవ్రవాదులు.. ఫోలే తల నరికి చంపి ఆ వీడియోను యూట్యూబ్లో పెట్టారు. ఇరాక్పై అమెరికా దాడులు కొనసాగిస్తే మరో అమెరికా జర్నలిస్టును హతమారుస్తామని హెచ్చరించారు.
ఉగ్రవాదుల దాష్టీకాన్ని అమెరికా, బ్రిటన్ తీవ్రంగా ఖండించాయి. జిమ్ను కిరాతకంగా హత్యచేయడం ప్రపంచాన్ని భయకంపితం చేసిందని అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా వ్యాఖ్యానించారు. ఈ చర్యతో ఐఎస్ఐఎస్ మిలిటెంట్లు తమకు ఏ మతం లేదని చాటుకున్నారన్నారని, ఇకపై వారి పని పడతామని హెచ్చరించారు.