Webdunia - Bharat's app for daily news and videos

Install App

లిబియాలో రెచ్చిపోయిన ఐసిస్... 30 హతం

Webdunia
సోమవారం, 20 ఏప్రియల్ 2015 (09:54 IST)
అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐసిస్ ఏదోక ప్రాంతంలో అరాచకం సృష్టిస్తూనే ఉంది. తన రక్తదాహాం ఇంకా తీరనిదిగానే మిగిలిపోతోంది. తాజాగా లిబియాలో మరో 30 మంది కాల్చి, తలలు నరికి చంపారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. 
 
30 మంది ఇథియోపియా క్రైస్తవులను నిర్బంధంలోకి తీసుకున్న ఐసిస్ వారిని లిబియాలో హతమార్చింది. ఆదివారం ఆ వీడియోను ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాద సంస్థ విడుదల చేసింది. దాదాపు 29 నిమిషాల నిడివిగల ఈ వీడియోలో కాషాయ దుస్తులు ధరించిన బందీలను రెండు గ్రూపులుగా చేశారు. 
 
వారిలో 12 మందిని బీచ్‌లో  తల నరికి చంపారు. మిగిలిన 17 మందికి పైగా ఉన్న వేరొక బృందాన్ని గుర్తు తెలియని ఎడారి ప్రాంతంలో మోకాలిపై కూర్చోబెట్టి తలపై కాల్చి చంపారు. ఇథియోపియాలో క్రైస్తవులు మతం మార్చుకొని ఇస్లాంలోకి చేరకపోతే ఇదేగతి పడుతుందని వీడియోలో హెచ్చరించారు. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments