Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ వీడియోలు చూడాలని ఐసిస్ ఉగ్రవాదులు ఒత్తిడి చేశారు : ఆంధ్రా వైద్యుడు

డాక్టర్ రామమూర్తి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ప్రముఖ వైద్యుడు. ఇటీవలే లిబియాలో ఐసిస్ ఉగ్రవాదుల చెర నుంచి ప్రాణాలతో బయటపడ్డారు. ఈయన ఆ ఉగ్ర సంస్థ గురించి అనేక విషయాలను వెల్లడించారు.

Webdunia
ఆదివారం, 26 ఫిబ్రవరి 2017 (12:52 IST)
డాక్టర్ రామమూర్తి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ప్రముఖ వైద్యుడు. ఇటీవలే లిబియాలో ఐసిస్ ఉగ్రవాదుల చెర నుంచి ప్రాణాలతో బయటపడ్డారు. ఈయన ఆ ఉగ్ర సంస్థ గురించి అనేక విషయాలను వెల్లడించారు. ఇరాక్, సిరియా, నైజీరియా సహా ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో ఐసిస్ ఉగ్రవాదులు సృష్టించిన మారణహోమానికి సంబంధించిన వీడియాలను చూడాలని తమను బలవంతం చేసేవారని చెప్పారు.
 
అయితే వారు తమపై ఎప్పుడూ భౌతిక దాడులకు దిగలేదని, మాటలతో మాత్రం హింసించేవారని పేర్కొన్నారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల్లో చాలామంది యువకులు బాగా చదువుకున్నవారేనని రామమూర్తి తెలిపారు. ముఖ్యంగా వారికి భారతదేశం గురించి చాలా విషయాలు తెలుసన్నారు. వీరంతా కలిసి భారత్‌ను ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు.
 
అదేసమయంలో తాను డాక్టర్‌ను కావడంతో ఆపరేషన్లను చేయాలని తనను బలవంతం చేసేవారని ఆయన పేర్కొన్నారు. తనను ఆపరేషన్ థియేటర్లోకి బలవంతంగా పంపించేవారని, అయితే తానెప్పుడూ ఆపరేషన్ కానీ, చిరికి కుట్లు కూడా వేయలేదన్నారు. తాను షిర్టేలో వర్కింగ్ క్యాంపులో ఉన్నప్పుడు ఉగ్రవాదులు మూడుసార్లు తనపై కాల్పులు జరిపారని, అదృష్టవశాత్తు తాను ప్రాణాలతో బయటపడినట్టు చెప్పారు.

మేనమామకు మేనల్లుడి అరుదైన బహుమతి... ఏంటది?

OMG (ఓ మాంచి ఘోస్ట్) ట్రైలర్ లో నవ్విస్తూ, భయపెట్టిన నందితా శ్వేత

రాజధాని రౌడీ సినిమాకు థియేటర్స్ నుంచి హిట్ రెస్పాన్స్ వస్తోంది: నిర్మాత

రిలీజ్ కు ముందే ట్రెండ్ అవుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ట్రైలర్

డబుల్ ఇస్మార్ట్ క్లయిమాక్స్ లో రామ్ యాక్షన్ సీన్ హైలెట్ !

మీరు తెలుసుకోవలసిన ప్రతి సాధారణ వాస్కులర్ ప్రొసీజర్‌లు, శస్త్రచికిత్సల గురించి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments