Webdunia - Bharat's app for daily news and videos

Install App

అట్టుడికిపోతున్న ఇరాన్.. 31 మంది మహిళల మృతి!

Webdunia
శుక్రవారం, 23 సెప్టెంబరు 2022 (09:09 IST)
ఇరాన్ అట్టుడికిపోతోంది. హిజాబ్‌కు వ్యతిరేకంగా ఆ దేశ మహిళలు రోడ్డెక్కారు. హిజాబ్‌ను రద్దు చేయాలంటూ చేస్తున్న ఆందోళనలు రోజురోజుకూ తీవ్రతరమవుతున్నాయి. అనేక మంది మహిళలు వీధుల్లోకి వచ్చిన హిజాబ్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నారు. పైగా, హిజాబ్‌పై తన నిరసనను తెలిపేందుకు వీలుగా వెంట్రులను కూడా కత్తిరించుకున్నాడు. దీంతో ఆందోళనకారులను అణిచివేసేందుకు ఇరాన్ బలగాలు రంగంలో దిగాయి. ఆందోళనకారులకు, భద్రతా బలగాలకు మధ్య ఏర్పడిన ఘర్షణల్లో ఇప్పటివరకు 31 మంది చనిపోయారు. 
 
హిజాబ్‌ను సరిగా ధరించలేదన్న కారణంతో గత వారం మాసా అమీని అనే 22 యేళ్ల యువతిని నైతిక విభాగం పోలీసులు అరెస్టు చేశారు. వారి కస్టడీలో ఆ యువతి తీవ్రంగా గాయపడి, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసింది. ఈ విషయం తెలిసిన ఆమె సొంత ప్రావిన్స్‌ కుర్దిస్థాన్‌లో నిరసనలు మొదలయ్యాయి. అవి క్రమంగా దేశమంతా వ్యాపించాయి. 
 
హిజాబ్‌ ధారణకు వ్యతిరేకంగా మొదలైన అల్లర్లు రోజురోజుకు తీవ్రరూపం సంతరించుకుంటున్నాయి. మహిళలు రోడ్డెక్కి నిరసనలు తెలుపుతున్నారు. రాజధాని టెహ్రాన్ సహా 30 నగరాల్లో గురువారం రోడ్డుపైకొచ్చి నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. 
 
హిజాబ్‌లను తొలగించి నడిరోడ్డుపై తగలబెట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిరసనకు దిగిన ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. భాష్పవాయువు, వాటర్ కేనన్లను ప్రయోగించారు. 
 
మరికొన్ని చోట్ల కాల్పులు కూడా జరిపారు. ఈ క్రమంలో బలగాలు, నిరసనకారులకు మధ్య జరిగిన ఘర్షణల్లో ఒక్క కుర్దిస్థాన్‌లోనే 15 మంది బలయ్యారు. మజందరన్ ప్రావిన్సులో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం ఇరాన్ దేశ వ్యాప్తంగా ఉద్రిక్త వాతావరణం నెలకొనివుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NBK: బాలక్రిష్ణ పుట్టినరోజున అఖండ2 అప్ డేట్ రాబోతోంది

Rajendra Prasad: తన ఒరిజినల్ గెటప్ ఇదే అంటున్న రాజేంద్రప్రసాద్

Nikhil: నిఖిల్ కత్తి యోధుడిలా సంయుక్త విల్లు బాణంతో స్వయంభు లో యాక్షన్ సీన్

Sudheer: కృష్ణ కు నివాళితో జటాధర చిత్రం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప్రారంభించిన సుధీర్ బాబు

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments