బాలికపై అత్యాచారం... దోషిగా తేలితే బహిరంగంగా ఉరితీశారు..

సెల్వి
శనివారం, 12 జులై 2025 (14:48 IST)
ముస్లిం దేశాల్లో చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. శిక్షలను కూడా బహిరంగంగానే అమలు చేస్తుంటారు. తాజాగా ఓ బాలికపై అత్యాచారానికి పాల్పడిన ముద్దాయిని బహిరంగంగా ఉరితీశారు. ఈ ఘటన ఇరాన్ దేశంలో జరిగింది. ఈ మేరకు ఆ దేశ మీడియా వెల్లడించింది. 
 
ఇరాన్ మీడియా కథనాల మేరకు బుకాన్‌కు చెందిన ఓ బాలికను అత్యాచారం, హత్య చేసిన కేసులో ఓ వ్యక్తి దోషిగా తేలాడు. అతడికి బహిరంగంగా మరణశిక్ష విధించాలని బాధిత కుటుంబసభ్యులు, ప్రజల నుంచి పెద్దఎత్తున అభ్యర్థనలు వచ్చాయి. 
 
మార్చిలో అతడికి మరణశిక్ష ఖరారు కాగా.. సుప్రీంకోర్టు కూడా దాన్ని సమర్థించింది. భావోద్వేగాలతో ముడిపడిన కేసు కాబట్టి కఠినశిక్షపై నిర్ణయం తీసుకున్నామని న్యాయమూర్తి పేర్కొన్నారు. బాధిత కుటుంబసభ్యుల కోరిక మేరకు శిక్షను విధిస్తున్నట్లు చెబుతూ తాజాగా దాన్ని అమలు చేశారు.
 
ఇరాన్‌లో బహిరంగంగా మరణశిక్షలు విధించడం సాధారణమే. హత్య, అత్యాచారం వంటి తీవ్రత ఎక్కువున్న కేసుల్లో ఇలాంటి కఠినమైన శిక్షలను అమలుచేస్తారు. మానవ హక్కుల సంఘాల ప్రకారం.. ప్రపంచంలో ఎక్కువ మరణశిక్షలు అమలుచేసే దేశాల్లో ఇరాన్‌ రెండో స్థానంలో ఉంది. మొదటి స్థానంలో చైనా ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆయన పిలిస్తే అన్నీ వదిలేసి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నా : రేణూ దేశాయ్

మహేష్ బాబు రాముడిగా కనిపిస్తారు: రాజమౌళి బిగ్ అప్డేట్

శ్రీదేవి అపల్లా, ఫెమినా జార్జ్, విజయ్ బుల్గానిన్ కాంబోలో ద్విభాషా చిత్రం

Rajamouli: రాజమౌళి, మహేష్ బాబు చిత్రం వారణాసి ఒక్క పార్ట్ నా?

అరుళ్ నిథి, మమతా మోహన్‌దాస్ ల మై డియర్ సిస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments