Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలికపై అత్యాచారం... దోషిగా తేలితే బహిరంగంగా ఉరితీశారు..

సెల్వి
శనివారం, 12 జులై 2025 (14:48 IST)
ముస్లిం దేశాల్లో చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. శిక్షలను కూడా బహిరంగంగానే అమలు చేస్తుంటారు. తాజాగా ఓ బాలికపై అత్యాచారానికి పాల్పడిన ముద్దాయిని బహిరంగంగా ఉరితీశారు. ఈ ఘటన ఇరాన్ దేశంలో జరిగింది. ఈ మేరకు ఆ దేశ మీడియా వెల్లడించింది. 
 
ఇరాన్ మీడియా కథనాల మేరకు బుకాన్‌కు చెందిన ఓ బాలికను అత్యాచారం, హత్య చేసిన కేసులో ఓ వ్యక్తి దోషిగా తేలాడు. అతడికి బహిరంగంగా మరణశిక్ష విధించాలని బాధిత కుటుంబసభ్యులు, ప్రజల నుంచి పెద్దఎత్తున అభ్యర్థనలు వచ్చాయి. 
 
మార్చిలో అతడికి మరణశిక్ష ఖరారు కాగా.. సుప్రీంకోర్టు కూడా దాన్ని సమర్థించింది. భావోద్వేగాలతో ముడిపడిన కేసు కాబట్టి కఠినశిక్షపై నిర్ణయం తీసుకున్నామని న్యాయమూర్తి పేర్కొన్నారు. బాధిత కుటుంబసభ్యుల కోరిక మేరకు శిక్షను విధిస్తున్నట్లు చెబుతూ తాజాగా దాన్ని అమలు చేశారు.
 
ఇరాన్‌లో బహిరంగంగా మరణశిక్షలు విధించడం సాధారణమే. హత్య, అత్యాచారం వంటి తీవ్రత ఎక్కువున్న కేసుల్లో ఇలాంటి కఠినమైన శిక్షలను అమలుచేస్తారు. మానవ హక్కుల సంఘాల ప్రకారం.. ప్రపంచంలో ఎక్కువ మరణశిక్షలు అమలుచేసే దేశాల్లో ఇరాన్‌ రెండో స్థానంలో ఉంది. మొదటి స్థానంలో చైనా ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments