Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరాచీలో అత్యవసరంగా భారత విమానం ల్యాండింగ్

Webdunia
ఆదివారం, 17 జులై 2022 (11:20 IST)
భారత్‌కు చెందిన ఇండిగో విమానయాన సంస్థకు చెందిన విమానం అత్యవసరంగా పాకిస్థాన్‌లో ల్యాండింగ్ చేశారు. విమానంలో తలెత్తిన సాంకేతిక సమస్య కారణంగా ఈ విమానానికి కరాచీలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ కల్పించారు. 
 
యూఏఈలోని షార్జా నగరం నుంచి హైదరాబాద్‌కు రావాల్సిన ఈ విమానంలో మార్గమధ్యంలో సాంకేతిక లోపం తలెత్తినట్లు పైలట్‌ గుర్తించారు. దీంతో అత్యవసరంగా కరాచీలో ల్యాండ్‌ చేశారు. ప్రస్తుతం అక్కడే తనిఖీలు నిర్వహిస్తున్నారు. 
 
ప్రయాణికులను తరలించడం కోసం ఇండిగో మరో విమానాన్ని అక్కడకు పంపేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. కాగా, భారత్‌కు చెందిన ఓ విమానం ఇలా పాక్‌లో ల్యాండ్‌కావడం గత రెండువారాల్లో ఇది రెండోసారి. 
 
గతవారం స్పైస్‌జెట్‌కు చెందిన ఢిల్లీ - దుబాయ్ విమానం ఇంధన ట్యాంకులో లోపం తలెత్తి ఉన్నఫళంగా కరాచీలో ల్యాండ్‌ చేయాల్సి వచ్చింది. తర్వాత ఓ ఇండికేటర్‌ లైట్‌లో లోపాన్ని గుర్తించారు. దీంతో విమానయాన నియంత్రణా సంస్థ డీజీసీఏ జులై 6న స్పైస్‌జెట్‌కు నోటీసులు కూడా జారీ చేసింది. 
 
ఈ మధ్యకాలంలో దేశీయ విమానాల్లో తరచూ సాంకేతిక లోపాలు తలెత్తుతుండడం ప్రయాణికులను ఆందోళనకు గురిచేస్తోంది. ఇటీవల స్పైస్‌జెట్‌కు చెందిన పలు విమానాలు అత్యవసరంగా ల్యాండయిన విషయం తెలిసిందే. డీజీసీఏ ఈ సంస్థకు షోకాజ్ నోటీసులు సైతం జారీ చేసింది. ఇండిగోలోనూ ఇటీవల ఈ తరహా సమస్యలు వెలుగులోకి వచ్చాయి.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ రెండో భాగంగా చిత్రం విడుదల తేదీ మార్పు

Peddi: జానీ మాస్టర్ కొరియోగ్రఫీలో మైసూర్‌లో రామ్ చరణ్ పెద్ది సాంగ్ షూటింగ్

నాగ చైతన్య, కార్తీక్ దండు చిత్రంలో లాపతా లేడీస్ ఫేమ్ స్పర్ష్ శ్రీవాస్తవ

Akhanda 2: బాలకృష్ణ అఖండ 2 గురించి నందమూరి తేజస్విని అప్‌డేట్

Manoj: మంచు మనోజ్ ను హైలైట్ చేసిన మిరాయి ట్రైలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments