Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాషింగ్టన్‌: దోపిడి దొంగల చేతిలో హతమైన భారతీయుడు... ముఖానికి మాస్కులు ధరించి..?

అమెరికాలో భారతీయుడు ప్రాణాలు కోల్పోయాడు. వాషింగ్టన్ రాష్ట్రంలోని మకియా నగరంలో భారతీయుడు మరణించాడు. అదీ దోపిడి దొంగల చేతిలో హతమైనాడు. వాషింగ్టన్ రాష్ట్రంలోని యకిమా నగరంలో ఈ ఘటన చోటుచేసుకొంది.

Webdunia
శనివారం, 8 ఏప్రియల్ 2017 (09:53 IST)
అమెరికాలో భారతీయుడు ప్రాణాలు కోల్పోయాడు. వాషింగ్టన్ రాష్ట్రంలోని మకియా నగరంలో భారతీయుడు మరణించాడు. అదీ దోపిడి దొంగల చేతిలో హతమైనాడు. వాషింగ్టన్ రాష్ట్రంలోని యకిమా నగరంలో ఈ ఘటన చోటుచేసుకొంది. వివరాల్లోకి వెళితే.. పంజాబ్‌కు చెందిన విక్రమ్ జర్యాల్ నెలరోజుల క్రితమే అమెరికా వెళ్ళాడు. ప్రస్తుతం యకిమా సిటీలోని ఏఎం-పీఎం గ్యాస్ స్టేషన్‌లో క్లర్క్‌గా విధులు నిర్వహిస్తున్నాడు.
 
ముఖానికి మాస్కులు ధరించిన ఇద్దరు వ్యక్తులు విక్రమ్ పనిచేస్తోన్న గ్యాస్ స్టేషన్‌కు వచ్చి డబ్బులు డిమాండ్ చేశారు. విక్రమ్ స్టేషన్ కౌంటర్‌లో ఉన్న నగదును వారికిచ్చాడు. అయినా ఆ ఇద్దరు దుండగుల్లో ఓకరు విక్రమ్ పై కాల్పులు జరిపారు. అనంతరం వారు పారిపోయారు. ఈ ఘటన జాత్యంహకార దాడే అయి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.
 
దుండగులు వెళ్ళిపోయిన తర్వాత కొందరు విక్రమ్‌ను గుర్తించి ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే అతడు ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనను కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్ ఖండించారు.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments