Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌పై యుద్ధానికి సిద్ధమవుతున్న పాకిస్థాన్.. మంచు కురిసేలోపే ప్రతీకారం

భారత్‌పై పాకిస్థాన్ యుద్ధానికి సిద్ధమవుతోందట. అదీ కూడా జమ్మూకాశ్మీర్ లోయల్లో మంచు కురిసే సమయానికే ప్రతీకారం తీర్చుకునేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. యురీ ఉగ్రదాడి తర్వాత పాక్ ఆక

Webdunia
శుక్రవారం, 28 అక్టోబరు 2016 (14:57 IST)
భారత్‌పై పాకిస్థాన్ యుద్ధానికి సిద్ధమవుతోందట. అదీ కూడా జమ్మూకాశ్మీర్ లోయల్లో మంచు కురిసే సమయానికే ప్రతీకారం తీర్చుకునేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. యురీ ఉగ్రదాడి తర్వాత పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రతాండాలపై భారత ఆర్మీ మెరుపుదాడి జరిపి ఉగ్రవాదులను మట్టుబెట్టిన విషయం తెల్సిందే. 
 
ఈ సర్జికల్ దాడులపై పాకిస్థాన్ రగిలిపోతోంది. ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది. ఈ క్రమంలో, మంచు కురిసే లోపల భారత భూగాగంలోకి ఉగ్రవాదులను పంపి, మారణహోమం సృష్టించేందుకు చూస్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే, అంతర్జాతీయ సరిహద్దు వద్ద పాక్ రేంజర్లు నిత్యం కాల్పులకు తెగబడుతున్నారు. 
 
ఈ కాల్పులు మరికొద్ది రోజులు కొనసాగే అవకాశం ఉంది. మరోవైపు... గత నాలుగు రోజులుగా పాక్‌కు చెందిన ఎస్ఎస్‌జీ కమెండో ప్లటూన్లు సరిహద్దుల్లో మోహరిస్తున్నాయి. 14 నుంచి 15 ప్లటూన్లను ఓ కల్నల్ ర్యాంక్ అధికారి పర్యవేక్షిస్తున్నారని ఇంటలిజెన్స్ రిపోర్టులు వచ్చాయి. మరోవైపు, పాక్ కాల్పులను భారత భద్రతాదళాలు సమర్థవంతంగా తిప్పికొడుతున్నాయి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అసలే ఎండాకాలం.. రోజుకు 11 సార్లు నీళ్ళు తాగాలి.. నటుడు పృథ్వీ ట్వీట్

Tamannaah Bhatia : ఓదెలా-2 టీజర్ లాంఛ్.. నిజంగా అదృష్టవంతురాలిని.. తమన్నా (video)

వరుస సినిమాలను లైనులో పెట్టిన చిరంజీవి.. హీరోయిన్‌గా బాలీవుడ్ హీరోయిన్!

విజువల్ ఎఫెక్ట్స్ తీసుకువచ్చిన మహానుభావుడు కోడి రామకృష్ణ:

మెగాస్టార్ సరసన నటించనున్న రాణి ముఖర్జీ.. నాని సమర్పణలో?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గవ్వలండోయ్ గవ్వలు బెల్లం గవ్వలు

దుబాయ్-ప్రేరేపిత క్యాప్సూల్ కలెక్షన్‌ ప్రదర్శన: భారతీయ కోటూరియర్ గౌరవ్ గుప్తాతో విజిట్ దుబాయ్ భాగస్వామ్యం

క్యాప్సికమ్ ప్రయోజనాలు ఏమిటి?

మహిళలకు మేలు చేసే విత్తనాలు.. చియా, గుమ్మడి, నువ్వులు తీసుకుంటే?

దృఢమైన ఎముకలు కావాలంటే?

తర్వాతి కథనం
Show comments