Webdunia - Bharat's app for daily news and videos

Install App

శాంతియుతంగా చ‌ర్చ‌లు చేద్దామా? దెబ్బకు కాళ్ల బేరానికి వచ్చిన పాక్‌!

సరిహద్దుల్లో కాల్పులతో పేట్రేగుతున్న పాకిస్థాన్‌ సైన్యం.. తాజాగా చర్చలకు దిగివచ్చిన సంగతి తెలిసిందే. సరిహద్దు నియంత్రణ రేఖ (ఎల్‌వోసీ) వద్ద అనుమానిత ఉగ్రవాదులు ముగ్గురు భారతీయ సైనికులను పొట్టన బెట్టుకున్నారు. అంతేకాకుండా ఒక సైనికుడి శరీరాన్ని ముక్కలుగ

Webdunia
శనివారం, 26 నవంబరు 2016 (20:36 IST)
సరిహద్దుల్లో కాల్పులతో పేట్రేగుతున్న పాకిస్థాన్‌ సైన్యం.. తాజాగా చర్చలకు దిగివచ్చిన సంగతి తెలిసిందే. సరిహద్దు నియంత్రణ రేఖ (ఎల్‌వోసీ) వద్ద అనుమానిత ఉగ్రవాదులు ముగ్గురు భారతీయ సైనికులను పొట్టన బెట్టుకున్నారు. అంతేకాకుండా ఒక సైనికుడి శరీరాన్ని ముక్కలుగా నరికేశారు. దీంతో రగిలి పోయిన భారత సైన్యం దీటుగా బదులిచ్చింది. మరింత దీటుగా పాక్‌ సైన్యానికి జవాబు చెప్తామని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో పాక్‌ అధికారులు భారత బలగాల షెల్లింగ్‌ దాడుల్లో 11 మంది పౌరులు, ముగ్గురు సైనికులు బుధవారం చనిపోయినట్టు ప్రకటించారు. 
 
అంతేకాకుండా బుధవారం సాయంత్రం పాక్‌ విజ్ఞప్తి మేరకు మిలటరీ ఆపరేషన్స్‌ డైరెక్టర్‌ జనరళ్లు హాట్‌ లైన్‌లో చర్చించి కాల్పుల విరమణ పాటించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో రక్షణమంత్రి మనోహర్‌ పరీకర్‌ స్పందిస్తూ.. సరిహద్దుల్లో 'పిరికిపంద' దాడులను భారత్‌ దీటుగా తిప్పికొడుతుండటంతో దాయాది పాకిస్థాన్‌ కాళ్ల బేరానికి వచ్చిందని, దాడులను ఆపాలని భారత్‌కు విజ్ఞప్తి చేసిందని పేర్కొన్నారు. త్వరలో ఎన్నికలు జరగనున్న గోవాలోని ఓ సభలో ప్రసంగించిన పారీకర్‌.. పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా దేశ నాయకత్వం బలమైన విధాన నిర్ణయాలు తీసుకుంటున్నదని కొనియాడారు. 
 
'మన సైన్యం వీరోచితమైనదనే విషయంలో ఎలాంటి సందేహం లేదు. కానీ తొలిసారి దేశ రాజకీయ నాయకత్వం కూడా బలమైన విధాన నిర్ణయాలు తీసుకుంటున్నది. అంతేకాకుండా పరికిపందల దాడులకు మేం దీటుగా బదులిస్తున్నాం. కొన్నిరోజులుగా ఇలా బలంగా ప్రతిస్పందిస్తుండటం  వాళ్లు దిగొచ్చి 'దయచేసి ఆపండి. మేం మీకు విజ్ఞప్తి చేస్తున్నాం' అంటూ వేడుకుంటున్నారు. దీనిని ఆపడానికి మాకేం అభ్యంతరంలేదు. కానీ మీరు కూడా ఆపాలి. అప్పుడే సరిహద్దుల్లో కాల్పులు ఉండవు' అని పారీకర్‌ వ్యాఖ్యానించారు. మరోవైపు సింధు నదీ జలాలపై భారతదేశానికి హక్కు ఉన్నదంటూ నరేంద్ర మోదీ ప్రకటించడంతో పాకిస్తాన్ బెంబేలెత్తిపోతోంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మన్యం ధీరుడు.. సీతారామరాజు చిత్రం ఎలా వుందంటే.. రివ్యూ

చిరంజీవికి అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి అవార్డ్ ప్రకటించిన నాగార్జున

జయం రవి కాపురంలో చిచ్చుపెట్టిన బెంగుళూరు సింగర్?

ఫియర్ ద్వారా ఆ లిస్టులో ఇండియా పేరు చూసినప్పుడు గర్వంగా అనిపించింది: దర్శకురాలు హరిత

ప్లీజ్ ... నో పాలిటిక్స్ : రజనీకాంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తింటే ప్రయోజనాలు ఏమిటి?

బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్న 7 ఏళ్ల బాలుడికి అమెరికన్ ఆంకాలజీ విజయవంతంగా చికిత్స

పీసీఓఎస్ అవగాహన మాసం: సహజసిద్ధంగా పీసీఓఎస్ నిర్వహణకు చిట్కాలు

యూఎస్ పోలో ఆసన్‌తో కలిసి శ్రీ సవాయి పద్మనాభ్ సింగ్ కలెక్షన్

మణిపాల్ హాస్పిటల్‌కు ఎన్ఏబీహెచ్ డిజిటల్ హెల్త్ అక్రిడిటేషన్-గోల్డ్ లెవెల్

తర్వాతి కథనం
Show comments