భారత్-అమెరికా సంబంధాల్లో కొత్తశకం: జో బైడెన్

Webdunia
శనివారం, 25 సెప్టెంబరు 2021 (10:58 IST)
అమెరికా పర్యటనలో వున్నారు ప్రధాని మోడీ. శుక్రవారం ఆదేశ అధ్యక్షులు జో-బైడెన్‌తో సమావేశమయ్యారు. కీలక విషయాలపై చర్చించారు. జో బైడెన్‌ అమెరికా ప్రెసిడెంట్ అయ్యాక తొలిసారి ఈ సమావేశం జరిగింది. భారత్-అమెరికా సంబంధాలు మరింత బలపడనున్నాయని ఈ సందర్భంగా అన్నారు బైడెన్. ఇరుదేశాల సంబంధాల్లో టెక్నాలజీ కీలకపాత్ర పోషించనుందన్నారు బైడెన్. 
 
వాణిజ్య రంగంలో పరస్పర సహకారం రెండు లాభదాయకమన్నారు. భారత్-అమెరికా సంబంధాల్లో కొత్తశకం మొదలవుతోందని చెప్పారు. అమెరికాకు ప్రధాన మిత్రదేశాల్లో భారత్ కూడా ఒకటని స్పష్టం చేశారు.
 
ఇక ఇండియా-అమెరికా దేశాల మధ్య వాణిజ్య అంశాలు చాలా కీలకమన్నారు ప్రధాని మోడీ. ఈ దశాబ్దంలో ఇరు దేశాలు ఎంతో సహకరించుకున్నాయని చెప్పారు. వాణిజ్య అంశాలు మరింత బలపడడం చాలా అవసరమన్నారు. 
 
ఆ తర్వాత వైట్‌హౌస్‌లో క్వాడ్‌ దేశాల సదస్సు జరిగింది. అమెరికా, భారత్‌, ఆస్ట్రేలియా, జపాన్‌ దేశాలు పాల్గొన్నాయ్‌. కరోనా, వాతావరణం, ఇండో-పసిఫిక్ రీజియన్‌లో భద్రతపై కీలకంగా చర్చ జరిగింది. గతంలో సునామీపై కలిసికట్టుగా పనిచేసి, ప్రపంచానికి మద్ధతుగా నిలిచామన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Purush: భిన్నమైన క్యాప్షన్స్, పోస్టర్‌లతో డిఫరెంట్ మూవీ పురుష

Prerna Arora: ఆరెంజ్ స్పూర్తితో తెలుగు సినిమా చేశా - జటాధర బ్లాక్ మ్యాజిక్ కథ : నిర్మాత ప్రేరణ అరోరా

Aadi Saikumar: శంబాల ఏ ఒక్కరినీ నిరాశపర్చదు : ఆది సాయికుమార్

సింగర్ రామ్ మిరియాల పాడిన టైటిల్ సాంగ్ సంతాన ప్రాప్తిరస్తు

Mahesh Chandra: పిఠాపురంలో అలా మొదలైంది అంటోన్న దర్శకుడు మహేష్‌చంద్ర

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

తర్వాతి కథనం
Show comments