Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూర్ఖుల స్వర్గంలో నరేంద్ర మోడీ సర్కారు: పాక్ అధ్యక్షుడు

Webdunia
ఆదివారం, 25 ఆగస్టు 2019 (18:05 IST)
మూర్ఖుల స్వర్గంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సర్కారు ఉందని పాకిస్థాన్ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ స్పష్టం చేశారు. ఆయన ఆదివారం విదేశీ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన భారత్‌పై పలు ఆరోపణలు చేశారు. ముఖ్యంగా, కాశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దుపై విమర్శలు గుప్పించారు. 
 
కాశ్మీర్ విషయంలో రాజ్యాంగంలో మార్పులు చేసిన పర్యవసానంగా తీవ్రవాదం పెరిగితే అందుకు పాకిస్థాన్ బాధ్యత వహించబోదని స్పష్టం చేశారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో కాశ్మీర్ అంశంపై చేసిన తీర్మానాలను భారత్ తుంగలో తొక్కిందని ఆరోపించారు. 
 
ముఖ్యంగా, పుల్వామా వంటి ఘటనలను భారత్ సాకుగా చూపి పాకిస్థాన్‌పై భారత్ దాడులకు పాల్పడవచ్చేమో కానీ, తాము మాత్రం యుద్ధానికి వ్యతిరేకమని ఆయన స్పష్టం చేశారు. 
 
అయితే, భారత్ మాత్రం ఒకవేళ యుద్ధానికి దిగితే మాత్రం ప్రత్యర్థిని ఎదుర్కొనే హక్కు తమకుందన్నారు. భారత్‌లో అధికారంలో ఉన్న మోడీ సర్కారు మూర్ఖుల స్వర్గంలో ఉందని, కాశ్మీర్ విషయంలో నిప్పుతో చెలగాటమాడుతున్నారని అల్వీ విమర్శించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లైసెన్స్ ఉన్న బెట్టింగ్ యాప్‌‍లకే విజయ్ దేవరకొండ ప్రచారం చేశారట...

వాళ్లు ఇచ్చిన ఫీడ్‌బ్యాక్‌ టుక్‌టుక్‌ చిత్రం విజయంపై నమ్మకం పెరిగింది : నిర్మాత రాహుల్‌ రెడ్డి

Sapthagiri: తాగితే బ్రెయిన్ షార్ప్ గా తందానా అంటుందా !

betting apps: బెట్టింగ్ యాప్స్ తో సంబంధంలేదని ప్రకటించిన విజయ్ దేవరకొండ

Kiss Song from Jack: జాక్ - కొంచెం క్రాక్.. కిక్కాస్ టీజర్ విడుదల- ఏప్రిల్ 10న రిలీజ్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం
Show comments