Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌-చైనాల మధ్య ఒప్పందం.. త్వరలో బలగాల ఉపసంహరణ

Webdunia
బుధవారం, 11 నవంబరు 2020 (15:24 IST)
భారత్‌-చైనాలు వాస్తవాధీన రేఖ వద్ద ఉద్రిక్తతలు తగ్గించేలా చర్యలు చేపట్టాలని నిర్ణయించినట్లు వార్తా సంస్థలు ఊటంకిస్తాయి. గతవారం చుషూల్‌-మాల్దో పోస్టులో జరిగిన చర్చల్లో ఈ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఈ బలగాల ఉపసంహరణ కూడా త్వరలో పూర్తికావచ్చని తెలుస్తోంది. 
 
తూర్పు లద్దాఖ్‌లోని వివాదాస్పద ప్రాంతాల నుంచి ఇరుపక్షాల బలగాలను ఉపసంహరించి ఏప్రిల్‌-మే నాడు అవి ఎక్కడ ఉన్నాయో అక్కడికి చేరుకొంటాయి. ఈనెల ఆరో తేదీన జరిగిన 8వ విడత కోర్‌కమాండర్‌ చర్చల్లో ఈ మేరకు నిర్ణయించారు. వారం రోజుల్లోపు మూడు దశల్లో దీన్ని అమలు చేయాల్సి ఉంది.
 
పాంగాంగ్‌ సరస్సు వద్ద చర్చలు జరిపిన తర్వాత ఒక్కరోజు వ్యవధిలో ట్యాంకులతో సహా సాయుధ వాహనాలను వాస్తవాధీన రేఖకు బాగా దూరంగా తరలించాలి. రెండో దశలో భాగంగా సరస్సు ఉత్తర భాగంలో సైనికుల సంఖ్యను క్రమంగా తగ్గిస్తారు.
 
రోజు 30శాతం బలగాలను మూడు రోజుల పాటు వెనక్కి పంపిస్తారు. భారత్‌ వైపు దళాలు ధ్యాన్‌చంద్‌ థాపా పోస్టు వద్ద ఉంటే చైనా బలగాలు ఫింగర్‌ ఎనిమిది వద్ద ఉంటాయి. ఇక మూడో దశలో చుషూల్‌, రజాంగ్‌లా వద్ద ఇరు పక్షాలు ఆక్రమించిన శిఖరాలు, ప్రాంతాలను ఖాళీ చేసి వెనక్కి వెళ్లాల్సి ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఒక అద్భుతమైన సినిమా చూశా.. ఎవరూ మిస్ కావొద్దు : ఎస్ఎస్ రాజమౌళి

హీరో విశాల్‌కు పెళ్లి కుదిరింది.. వధువు ఎవరంటే?

ఈ బర్త్ డే నుంచి నాకు కొత్త జన్మ మొదలు కాబోతోంది : మంచు మనోజ్

హీరో మహేశ్ బాబు కుటుంబంలో కరోనా వైరస్!!

జూనియర్ వెరీ ఎమోషన్ టచ్చింగ్ స్టొరీ : దేవిశ్రీ ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments