Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనా దుశ్చర్యలపై ప్రతిస్పందించిన భారత్!

Webdunia
సోమవారం, 22 సెప్టెంబరు 2014 (10:26 IST)
చైనా దుశ్చర్యలను నిన్నటిదాకా భరిస్తూ వచ్చిన భారత్, ఆదివారం నుంచి తన ప్రతిస్పందన చర్యలను ప్రారంభించింది. ఇందులో భాగంగా తొలి చర్యగా ఇరు దేశాల మధ్య జరగనున్న మీడియా చర్చలకు రెడ్ సిగ్నల్ చూపింది. 
 
తద్వారా ఇకనైనా సరిహద్దు నిబంధనలను గౌరవించకపోతే, భవిష్యత్తులో మరిన్ని నిరసన చర్యలను ఎదుర్కోవడంతో పాటు ఇరు దేశాల మధ్య సంబంధాలకు విఘాతం తప్పదని తేల్చిచెప్పింది. 
 
ఏటా చైనాలోని పలు మీడియా సంస్థలకు చెందిన ఎడిటర్లు భారత్‌లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా వారు భారత మీడియా ప్రతినిధులతో భేటీ కావడంతో పాటు ఇక్కడి మీడియా స్థితిగతులపై అవగాహన పెంచుకుంటున్నారు. 
 
ఈ ఏడాది ఈ వారంలో చైనా ఎడిటర్లు భారత్ రానున్నారు. ఇందుకోసం దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అయితే చైనా సైన్యం చొరబాటు యత్నాలు ఏమాత్రం తగ్గని నేపథ్యంలో మీడియా చర్చలను రద్దు చేస్తూ భారత్ నిర్ణయం తీసుకుంది.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments