Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫలించిన చర్చలు.. భారత్‌కు యురేనియం సరఫరాకు ఆస్ట్రేలియా సమ్మతం

Webdunia
సోమవారం, 30 నవంబరు 2015 (15:55 IST)
భారత్, ఆస్ట్రేలియా దేశాల మధ్య గత ఎనిమిది సంవత్సరాలుగా జరుగుతున్న చర్చలు ఎట్టకేలకు ఫలించాయి. ఫలితంగా భారత్‌కు యురేనియం సరఫరాకు కాన్‌బెర్రా పాలకులు సమ్మతం తెలిపారు. భారత్ - ఆస్ట్రేలియా అణు సహకార ఒప్పందంలో భాగంగానే ఈ చర్చలు విజయవంతమయ్యాయి. ఫలితంగా ఆస్ట్రేలియా- ఇండియా అణు సహకార ఒప్పందం తక్షణమే అమలులోకి వస్తుందని ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి జూలీ బిషప్ ప్రకటించారు. 
 
ఈ ఒప్పందం ప్రకారం ఆస్ట్రేలియన్ కంపెనీలు భారత్తో యురేనియం వ్యాపారం నిర్వహించుకోవడానికి వీలవుతుంది. భారత్లో పెరుగుతున్న విద్యుత్ అవసరాల మేరకు విద్యుత్ ఉత్పత్తికి ఈ ఒప్పందం ఎంతగానో దోహదం చేయనుంది. భారత్కు యురేనియం సరఫరా చేయడానికి గతంలో కూడా ఆస్ట్రేలియా సుముఖంగా ఉన్నప్పటికీ న్యూక్లియర్ అణు నిరాయుధాకరణ ఒప్పందంపై సంతకం చేయడానికి భారత్ నిరాకరించడం, ఆస్ట్రేలియాలో ప్రభుత్వాలు మారడం లాంటి అంశాలు ఈ ఆలస్యానికి కారణమయ్యాయి. 

థియేటర్లు బాగానే సంపాదించాయిగా... ఇప్పుడు మొత్తం పోయింది... గోవిందా!

సహచర నటి పవిత్ర ఎడబాటును భరించలేక నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య!!

దేవర ఫియర్ సాంగ్ వర్సెస్ పుష్ప సాంగ్.. జరగండి అంటోన్న చెర్రీ

కనీసం నా పిల్లలతో చాక్లెట్ పార్టీకి కూడా తీరికలేదు, రేవ్ పార్టీనా?: జానీ మాస్టర్ - video

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

కుర్చీలో కూర్చొని అదేపనిగా కాళ్లూపుతున్నారా?

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

Show comments