Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్ కాదు.. టెర్రరిస్థాన్... కాశ్మీర్‌పై పాక్ జోక్యాన్ని సహించం : భారత్ వార్నింగ్

ఐక్యరాజ్యసమితి వేదికగా పాకిస్థాన్‌ను భారత్ చీల్చిచెండాడింది. పాకిస్థాన్ ఒక టెర్రరిస్థాన్ అని, అది ఉగ్రవాదుల స్వర్గధామంగా మారిందని దుమ్మెత్తిపోసింది. పాకిస్థాన్ అంటే స్వచ్ఛమైన నేల అని, కానీ, ఇప్పుడు అద

Webdunia
శనివారం, 23 సెప్టెంబరు 2017 (06:51 IST)
ఐక్యరాజ్యసమితి వేదికగా పాకిస్థాన్‌ను భారత్ చీల్చిచెండాడింది. పాకిస్థాన్ ఒక టెర్రరిస్థాన్ అని, అది ఉగ్రవాదుల స్వర్గధామంగా మారిందని దుమ్మెత్తిపోసింది. పాకిస్థాన్ అంటే స్వచ్ఛమైన నేల అని, కానీ, ఇప్పుడు అది స్వచ్ఛమైన ఉగ్రభూమిగా మారిందని ఆగ్రహించింది. 
 
ఐక్యరాజ్యసమితిలో శుక్రవారం రైట్ ఆఫ్ రిప్లై కింద పాకిస్థాన్‌కు దిమ్మదిరిగే సమాధానమిచ్చింది. తమదేశానికి భయపడి భారత్ కాశ్మీర్ ప్రజల్ని అణిచివేసేందుకు ప్రయత్నిస్తున్నదన్న పాక్ ప్రధాని చేసిన వ్యాఖ్యలకు భారత్ ధీటుగా బదులిచ్చింది. పాకిస్థాన్‌లో ఉగ్రవాదం ఓ పరిశ్రమగా వర్ధిల్లుతున్నదని, దానికి రాజకీయ అండదండలున్నాయని ఐక్యరాజ్యసమితిలోని భారత తొలి కార్యదర్శి ఈనమ్ గంభీర్ పునరుద్ఘాటించారు. 
 
పాకిస్థాన్ అంటే స్వచ్ఛమైన నేల అని అర్థం. అది ఇప్పుడు స్వచ్ఛమైన ఉగ్రవాద భూభాగంగా మారిందంటూ విమర్శించింది. ఆ దేశం టెర్రరిస్టుల్ని తయారు చేసి, ప్రపంచానికి ఎగుమతి చేస్తున్నది. అందుకే అది పాకిస్థాన్ కాదు, టెర్రరిస్థాన్ అని ఈనమ్ వ్యాఖ్యానించారు. అలాగే, కాశ్మీర్ ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమేనన్న వాస్తవాన్ని పాకిస్థాన్ గుర్తెరిగి మసలుకోవాలని ఈనమ్ గంభీర్ సూచించారు. 

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments