Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనాకు తర్వాత పాకిస్థాన్‌లో విద్యా సంస్థలన్నీ ఓపెన్

Webdunia
బుధవారం, 30 సెప్టెంబరు 2020 (17:17 IST)
పాకిస్థాన్‌లో ఆరు నెలల విద్యా సంస్థలన్నీ గురువారం తెరుచుకున్నాయి. ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలలు రెండూ బుధవారం తెరుచుకున్నాయి. కాగా కోవిడ్ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాల్సిందిగా విద్యాసంస్థలకు అధికారులు ఆదేశాలు జారీచేశారు. ఫెడరల్ ఎడ్యుకేషన్ మినిస్టర్‌ షఫ్కత్ మహమూద్ మాట్లాడుతూ ప్రాథమిక పాఠశాలల్లో గరిష్ట సంఖ్యలో విద్యార్థులు చేరారన్నారు. 
 
విద్యాసంస్థలు మూసివేయడం వల్ల వారు ఎక్కువగా నష్టపోయారని తెలిపారు. కరోనా వైరస్ పరిస్థితిని సమగ్రంగా విశ్లేషించిన అనంతరం మాత్రమే అన్ని విద్యా సంస్థలను తెరిచేందుకు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. విద్యారంగంలో 1,71,436 కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించగా వీటిలో 1 శాతం సంక్రమణ మాత్రమే కనుగొనబడినట్లు తెలిపారు. 
 
ఈ డేటాను దృష్టిలో ఉంచుకుని ప్రాథమికస్థాయి తరగతులను తిరిగి ప్రారంభించాలని నిర్ణయించినట్లు మహ్మద్ పేర్కొన్నారు. పాకిస్థాన్‌లో ఇప్పటివరకు 3,12,263 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కాగా కోవిడ్‌-19తో 6,479 మంది చనిపోయారు. 467 కరోనా రోగుల పరిస్థితి విషమంగా ఉంది. 2,96,881 మంది వ్యాధి నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

డల్ గా వుంటే మ్యాడ్ లాంటి సినిమా చూడమని డాక్టర్లు కూడా చెప్పాలి : నాగచైతన్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments