Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్‌లో ఆహార సంక్షోభం తారా స్థాయికి.. లీటరు పాల ధర రూ.210

Webdunia
మంగళవారం, 14 ఫిబ్రవరి 2023 (09:47 IST)
పాకిస్థాన్ దేశంలో ఆర్థిక, ఆహార సంక్షోభం తారా స్థాయికి చేరింది. దీంతో నిత్యావసర వస్తు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఫలితంగా కేజీ చికెన్ ధర రూ.780 పలుకుతుండగా, లీటరు పాల ధర రూ.210గా ఉంది. ఈ ధరల భారంతో పాకిస్థాన్ ప్రజలు అల్లాడిపోతున్నారు. ప్రస్తుతం పాకిస్థాన్ దేశంలో గతంలో శ్రీలంకలో ఏర్పడిన ఆర్థిక, దుర్భిక్ష పరిస్థితులే నెలకొనివున్నాయి. 
 
ప్రస్తుతం పాకిస్థాన్ దేశంలో పాల లీటరు ధర రూ.190 నుంచి రూ.210 వరకు పలుకుతుంది. ఇక బ్రాయిలర్ చికెన్ ధర కేజీకి రూ.30 నుంచి రూ.40 చొప్పున పెరిగి ఇపుడు ఏకంగా రూ.780కి చేరింది. ఈ ధరలు చూసిన పాక్ ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. 
 
దీనికి కారణం నానాటికీ అడ్డూ అదుపులేకుండా ద్రవ్యోల్బణం పెరిగిపోతోంది. మరోవైపు, ఆర్థిక సంక్షోభం కారణంగా ఇంధర ధరలకు కూడా రెక్కలు వచ్చాయి. ఫలితంగా ప్రస్తుతం ఇంధన ధరలు కూడా రికార్డు స్థాయికి చేరాయి. ప్రస్తుతం లీటరు పెట్రోల్ ధర రూ.250 పలుకుతుండగా, లీటరు కిరోసిన్ ధర రూ.190 నుంచి రూ.200గా వుంది. పైగా, నానాటికీ ఇంధన డిమాండ్ పెరిగిపోతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nani: నాని ప్రెజెంట్ కోర్టు - స్టేట్ vs ఎ నోబడీ గ్లింప్స్ రిలీజ్

Tarun Bhaskar : సంతాన ప్రాప్తిరస్తు నుంచి తరుణ్ భాస్కర్ క్యారెక్టర్ పోస్టర్

Kannappa: ఆశక్తిగా మంచు కన్నప్ప రెండో టీజర్ విడుదల

ఆది సాయికుమార్‌ డివోష‌న‌ల్ సస్పెన్స్‌ థ్రిల్ల‌ర్ షణ్ముఖ

రాఘవేంద్రరావు ఆవిష్కరించిన 14 డేస్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో ట్రైలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

యూరిక్ యాసిడ్ తగ్గడానికి ఏమి చేయాలి?

ఇవి సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్

డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఎందుకు తినాలి?

పరగడుపున వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే ప్రయోజనాలు ఇవే

మహిళలు అల్లంతో కూడిన మజ్జిగ తాగితే.. నడుము చుట్టూ ఉన్న కొవ్వు?

తర్వాతి కథనం
Show comments