Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంటర్నెట్ యూజర్స్ 20 శాతమే! వెనుకంజలో భారత్..!

Webdunia
మంగళవారం, 24 మార్చి 2015 (15:04 IST)
ఆధునిక ప్రపంచంలో అంతా ఇంటర్నెట్ మయం అయిపోయింది. ఏది కావాలన్నా ఇంట్లో నుంచి బయటకు అడుగు పెట్టాల్సిన పనిలేదు. ఆన్‌లైన్‌లో అన్ని వస్తువులను కొనుగోలు చేసుకోవచ్చు. అయితే ప్రపంచంలో ఇంటర్నెట్ ఉపయోగించడంలో భారత దేశం మాత్రం ఇంకా వెనకబడే ఉందంటే ఆశ్చర్యం కలుగుతోంది. 
 
భారత్‌లో ఇంటర్నెట్ ఉపయోగిస్తున్నవారి సంఖ్య కేవలం 20 శాతం మాత్రమేనని ‘ప్యూ రీసెర్చ్ సెంటర్’ చేసిన అధ్యయనంలో వెల్లడైంది. 32 వర్ధమాన దేశాల్లో ఈ సర్వే నిర్వహించారు. భారత్‌లో ఇంటెర్నెట్‌ను ఉపయోగిస్తున్న 20 శాతం ప్రజల్లో 65 శాతం మంది సామాజిక వెబ్‌సైట్లను ఉపయోగిస్తున్నారు. 
 
మరో 55 శాతం మంది ఉద్యోగాల కోసం ఇంటర్నెట్‌ను సర్చ్ చేస్తున్నారు. ఇక దేశం మొత్తం జనాభాలో కేవలం 14 శాతం మంది మాత్రమే స్మార్ట్ ఫోన్లు కలిగివున్నారు. ఇండోనేషియాలో 24 శాతం మంది ఇంటర్నెట్ ఉపయోగిస్తుండగా, భారత్‌లో 20 శాతం, బంగ్లాదేశ్‌లో 11 శాతం, పాకిస్థాన్‌లో 8 శాతం మంది మాత్రమే ఇంటర్నెట్‌ను వాడుతున్నట్టు ఆ అధ్యయనంలో తేలింది.

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments