Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇమ్రాన్ ఖాన్‌కు దేశాన్ని పాలించడం రాదు : సుప్రీంకోర్టు

Webdunia
మంగళవారం, 16 మార్చి 2021 (14:10 IST)
పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్‌ను ఉద్దేశించి ఆ దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇమ్రాన్‌ ఖాన్‌కు దేశాన్ని పాలించడం రావడంలేదని ఆక్షేపించింది. దేశాన్ని పాలించే పద్ధతి ఇది కాదంటూ మండిపడింది. 
 
గత రెండు నెలలుగా కామన్ ఇంటరెస్ట్ కౌన్సిల్ (సీసీఐ) సమావేశాన్ని ఏర్పాటు చేయడంలో విఫలమవడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించింది. స్థానిక సంస్థల ఎన్నికల కేసు విచారణ సందర్భంగా ప్రభుత్వంపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇద్దరు సభ్యుల బెంచ్‌కు జస్టిస్ ఖాజీ ఫేజ్ ఇసా నాయకత్వం వహించారు.
 
దేశాన్ని నడిపించడానికి జనాభా గణన ప్రాథమిక అవసరమని నొక్కిచెప్పిన జస్టిస్ ఇసా.. ‘జనాభా లెక్కల ఫలితాలను విడుదల చేయడం ప్రభుత్వ ప్రాధాన్యం కాదా? మూడు ప్రావిన్సులలో ప్రభుత్వం ఉన్నప్పటికీ, మండలిలో ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు? ఈ ప్రభుత్వానికి దేశాన్ని నడిపించే సామర్థ్యం లేదు. లేదా నిర్ణయాలు తీసుకోలేకపోతున్నది’ అని అన్నారు. 
 
సీసీఐ నివేదికను ఎందుకు గోప్యంగా ఉంచారని ప్రశ్నించారు. మంచి పనులను రహస్యంగా ఉంచడంలో ఆంతర్యం ఏమిటి? ఇలా చేయడం మరిన్ని ప్రశ్నలను లేవనెత్తుతుంది" అని ఆయన అన్నారు. 

సంబంధిత వార్తలు

ధనుష్, సందీప్ కిషన్ సన్ ల రాయన్ థియేట్రికల్ రిలీజ్ డేట్ ఫిక్స్

కర్నాటక, హైదరాబాదు లో ప్రతి లొకేషన్ కి నెమలి వచ్చేది: హరోం హర డైరెక్టర్ జ్ఞానసాగర్ ద్వారక

తుఫాను హెచ్చరిక టైటిల్, ఫస్ట్ లుక్ విడుదల

యేవ‌మ్ టీమ్‌ను చూస్తుంటే ముచ్చ‌ట‌గా వుంది: మాస్ కా దాస్ విశ్వ‌క్‌సేన్

పుష్ప‌-2 ప్రోడక్ట్ పనుల్లో సుకుమార్ తో టెక్నీషియన్ విభేదాలు?

అంజీర పండు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

బ్రెయిన్ ట్యూమర్ సర్వైవర్స్‌తో అవగాహన వాకథాన్‌ని నిర్వహించిన కేర్ హాస్పిటల్స్, హైటెక్ సిటీ

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలిపే 9 కారణాలు

ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం 2024: గర్భిణీ తల్లులకు సురక్షితమైన ఆహార చిట్కాలు

చెరకు రసంతో ప్రయోజనాలు సరే.. అలాంటి వారికి ఇక్కట్లే..

తర్వాతి కథనం
Show comments