పాక్ మహిళను కన్నీరు పెట్టించిన పుల్వామా... మానవత్వాన్ని కుదువ పెట్టలేం...

Webdunia
గురువారం, 21 ఫిబ్రవరి 2019 (20:51 IST)
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడి పాకిస్థాన్ పాలకులకు చీమకుట్టినట్టుగా కూడా లేకపోయినప్పటికీ.. ఆ దేశానికి చెందిన ఓ మహిళను కదిలించింది. ఫలితంగా ఆమె కన్నీరు పెట్టింది. భారత్‌పై వ్యతిరేకత నరనరాన జీర్ణించుకున్న గడ్డపై పుట్టి పెరిగిన అమ్మాయి. పేరు సెహీర్‌ మీర్జా. ఆమె ఓ జర్నలిస్టు. 
 
పుల్వామా దాడిలో ప్రాణాలు కోల్పోయిన వీర జవాన్లకు సెల్యూట్ చేశారు. అంతేనా.. ఈ దాడి ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్టు బాహాటంగానే ప్రకటించారు. పైగా, భారత్‌కు మద్దతుగా 'యాంటీ హేట్‌ చాలెంజ్‌'ను చేపట్టింది. "దేశభక్తి కోసం మానవత్వాన్ని కుదువ పెట్టలేం" అంటూ తన ఫేస్‌బుక్‌ పేజీలో రాసుకుంది. దాని కింద.. "నేను పాక్‌ అమ్మాయిని. పుల్వామా దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను" అనే ప్లకార్డుతో కూడిన పోస్ట్‌ చేసింది. 
 
ఇపుడు ఆమెను స్ఫూర్తిగా తీసుకున్న అనేక మంది పాక్ పౌరులు భారత్‌కు అండగా నిలుస్తున్నారు. భారత్‌-పాక్‌ మధ్య స్పర్థలు పోయి.. శాంతినెలకొనాలని చాన్నాళ్లుగా సెహీర్‌ మీర్జా పోరాడుతోంది. అలాగే, భారత్‌ ప్రభుత్వం కూడా పాకిస్థానత్ పీచమణిచేలా చర్యలు చేపడుతోంది. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్ లో ఆయన రియల్ హీరో : ప్రియాంక అరుళ్ మోహన్

NTR: యుఎస్ కాన్సుల్ జనరల్ లారా విలియమ్స్ ను కలిసిన ఎన్.టి.ఆర్.

సిద్ధు జొన్నలగడ్డ, శ్రీనిధి శెట్టి, రాశి ఖన్నా చిత్రం తెలుసు కదా షూటింగ్ పూర్తి

Chiranjeevi: కిష్కింధపురి సినిమా చాలా బావుంది : మెగాస్టార్ చిరంజీవి

గ్రామీణ రాజకీయాలలో స్త్రీ ముద్ర చూపిస్తూ ప్రభుత్వ సారాయి దుకాణం చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లో సిగ్నేచర్ జ్యువెలరీ ఎగ్జిబిషన్‌ను నిర్వహిస్తున్న జోస్ అలుక్కాస్

కొత్తిమీర ఎందుకు వాడాలో తెలుసా?

వర్షాకాలంలో ఎలాంటి ఆహారం తినాలి? ఏవి తినకూడదు?

Mustard oil: ఆవనూనెతో ఆరోగ్యం మాత్రమే కాదు.. అందం కూడా..?

Coconut Milk: జుట్టు ఆరోగ్యానికి కొబ్బరి పాలు.. ఎలా వాడాలంటే?

తర్వాతి కథనం