Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యను కత్తితో పొడిచి కలలోనే చంపేశాడట.. కానీ రక్తపు మడుగులో?

అమెరికాలో ఓ వ్యక్తి ట్యాబ్లెట్ వేసుకుని ఆ మత్తులోనే భార్యను హతమార్చాడు. కలలో చంపేసినట్లు అనిపించిందని.. కానీ అదే విషయం కళ్లముందు జరిగిపోయిందని నానారకాలుగా మాట్లాడాడు. దీంతో పోలీసులు తలపట్టుకున్నారు. వ

Webdunia
మంగళవారం, 5 సెప్టెంబరు 2017 (17:46 IST)
అమెరికాలో ఓ వ్యక్తి ట్యాబ్లెట్ వేసుకుని ఆ మత్తులోనే భార్యను హతమార్చాడు. కలలో చంపేసినట్లు అనిపించిందని.. కానీ అదే విషయం కళ్లముందు జరిగిపోయిందని నానారకాలుగా మాట్లాడాడు. దీంతో పోలీసులు తలపట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే.. నార్త్ కరోలినాకు చెందిన మాథ్యూ జేమ్స్ ఫెల్ప్స్ ఉన్నట్టుండి అమెరికా ఎమెర్జీన్సీ నెంబర్ 911కి అర్థరాత్రి కాల్ చేశాడు. 
 
ఫోన్ చేసి అవతలి వారితో తన భార్యను తానే చంపేసినట్లు అనిపిస్తోందని.. వెంటనే ఇక్కడకు రాగలరా అని అడిగాడు. వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే అప్పటికే ఫెల్ప్స్ భార్య లారెన్‌ రక్తపు మడుగులో వుండటాన్ని చూసి షాక్ అయ్యారు. అంతేగాకుండా ఫెల్ప్స్ మృతదేహం పక్కనే కూర్చుని ఏడుస్తున్నాడు. దీంతో అతనే భార్యను చంపేసి వుంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. 
 
కేసు నమోదు చేసుకుని అరెస్ట్ చేసి విచారించారు. విచారణలో దగ్గుతో బాధపడుతున్న అతను ముందు రోజు రాత్రి కొరిసిడిన్ టాబ్లెట్ వేసుకుని నిద్రపోయాడు. కానీ నిద్ర మేల్కొన్న తర్వాత చూస్తే తన భార్య మరణించిందని.. పక్కనే కత్తికూడా వుందని చెప్పాడు. నిద్రలో వుండగా తన భార్యను తానే చంపినట్లు అనిపించిందని.. లేచి చూసేసరికి అది నిజమైందని తెలిపాడు. ఇలా నోటికొచ్చినట్లు వాగాడు. ఈ కేసుపై దర్యాప్తు జరుగుతోంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments