Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్‌లో అగ్నిప్రమాదం - 21 మంది సజీవ దహనం

Webdunia
గురువారం, 13 అక్టోబరు 2022 (11:49 IST)
పాకిస్థాన్ దేశంలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 21 మంది సజీవదహనమయ్యారు. వేగంగా వెళుతున్న బస్సులో మంటలు చెలరేగి 21 మంది అగ్నికీలల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 12 మంది చిన్నారులు కూడా ఉన్నారు. ఈ ప్రమాదంలో మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. సింధ్ ప్రావిన్స్‌లోని జంషోర్ జిల్లా నూరియాబాద్ సమీపంలో బుధవారం అర్థరాత్రి ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఏసీ బస్సులో షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ఘోరం జరిగినట్టు సమాచారం తెలుస్తోంది. 
 
సింధ్ ప్రావిన్స్ ప్రాంతానికి చెందిన 45 మంది ఏసీ బస్సులో సొంతూళ్లకు బయలుదేరారు. బస్సు జంషోర్ జిల్లా నూరియాబాద్ ఏం-9 మోటార్ వేపై వెళుతున్న సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కొద్ది నిమిషాల్లో బస్సు మంటల్లో కాలి బూడిదైపోయింది. కిటికీలు మూసి ఉండటంతో దట్టమైన పొగ అలుముకుంది. మంటలు కాలి కొందరు చనిపోగా, దట్టమైన ఊపిరాడక మరికొంతమంది ప్రాణాలు విడిచారు. 

సంబంధిత వార్తలు

భార్య భర్తల అహం తో విద్య వాసుల అహం చిత్రం - ట్రైలర్ కు స్పందన

అల్లు శిరీష్ బడ్డీ సినిమా నుంచి రొమాంటిక్ సాంగ్ రిలీజ్

ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది రింగ్స్ ఆఫ్ పవర్ ఆగస్ట్ లో ప్రైమ్ వీడియోలో సిద్ధం

డబుల్ ఇస్మార్ట్ లో అమ్మాయిలతో ఫ్లర్ట్ చేసే రామ్ గా దిమాకికిరికిరి టీజర్

రోజా, అనిల్ కుమార్ బాటలో సైలెంట్ అయిన రామ్ గోపాల్ వర్మ..?

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments