Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌లో శిశు మరణాల సంఖ్య అధికం : సమితి గణాంకాలు

Webdunia
గురువారం, 18 సెప్టెంబరు 2014 (13:08 IST)
పలు కారణాల రీత్యా భారత్‌లో శిశు మరణాల సంఖ్య ఎక్కువగా ఉన్నట్టు ఐక్యరాజ్య సమితి తాజా నివేదిక వెల్లడించింది. 1990 నుంచి శిశు మరణాలను అరికట్టేందుకు భారత్ ప్రత్యేకంగా దృష్టిసారించినప్పటికీ.. ఇప్పటికీ వాటిని అరికట్టలేక పోతోందని ఐరాస తెలిపింది. ఐక్యరాజ్యసమితి వెల్లడించిన తాజా గణాంకాల మేరకు 1990లో భారత్‌లో 33.3 లక్షల మంది చిన్నారులు మృత్యువాత పడగా, ఆ సంఖ్య 2013లో 13.4 లక్షల మంది చిన్నారులకు పరిమితమైందని నివేదికలు వెల్లడించాయి. 
 
రెండు దశాబ్దాల కాలంలో భారత్ అద్భుతమైన పురోగతి సాధించినప్పటికీ, నేటికీ భారత్‌లోనే అత్యధిక శిశుమరణాలు సంభవించడం దురదృష్టకరమని ఐక్యరాజ్యసమితి వ్యాఖ్యానించింది. ప్రపంచవ్యాప్తంగా ఐదేళ్లలోపు చిన్నారుల్లో సగం మరణాలు భారత్ (21 శాతం), నైజీరియా (13 శాతం), పాకిస్థాన్, కాంగో, చైనాల్లో నమోదవుతున్నాయని వెల్లడించింది. కాగా, నవజాత శిశు మరణాలను నివారించడంలో భారత్ గణనీయమైన వృద్ధి సాధించిందని ఐక్యరాజ్యసమితి తెలిపింది. అయితే, వీరిలో ఎక్కువగా నివారించదగ్గ రోగాల బారిన పడి మృతి చెందుతున్నారని ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది. 

మూడు డిఫరెంట్ వేరియేషన్స్ తో అజిత్ కుమార్ ద్విభాషా చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ

ఎన్టీఆర్ ‘దేవర’ నుంచి అనిరుద్ సారథ్యంలో ఫియర్ సాంగ్’ న్యూ లుక్ విడుదల

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments