Webdunia - Bharat's app for daily news and videos

Install App

48 గంటల్లో 3 వేల మంది తాలిబన్ తీవ్రవాదులను ఉరితీయండి: షరీఫ్‌కు ఆర్మీ చీఫ్!

Webdunia
శుక్రవారం, 19 డిశెంబరు 2014 (11:41 IST)
పెషావర్ సైనిక పాఠశాలపై తాలిబన్ తీవ్రవాదులు సృష్టించిన మారణహోమంతో పాకిస్థాన్‌ సైనికుల రక్తం ఉడికిపోతోంది. ఈ మారణహోమానికి ప్రతీకారంగా దేశంలోని ఉగ్రవాదులందరినీ ఉరి తీయాలని ఆ దేశ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ రాహీల్ షరీఫ్ సూచించారు. అదీ కూడా 48 గంటల్లోగా మూడు వేల మంది ఉగ్రవాదులను ఉరి తీయాలని డిమాండ్ చేస్తూ ప్రధానికి ఆయన సందేశం పంపారు. ముంబై ఉగ్రవాద దాడి సూత్రధారి జకీవుర్ రెహ్మాన్ లఖ్వీ బెయిల్‌పై విడుదలైన మరుసటి రోజే ఆయన ఈ మేరకు ప్రధానికి సందేశం పంపడం గమనార్హం. 
 
పెషావర్ సైనిక పాఠశాల ఘటనను ప్రస్తావించిన షరీఫ్ తాలిబన్లకు తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తూ ట్వీట్లు చేశారు. ‘తాలిబన్లకిదే హెచ్చరిక. మీరు మా పిల్లలను చంపేశారు. దీనికి మీరు తీవ్ర పరిణామాలు ఎదుర్కొనక తప్పదు. మూల్యం చెల్లించేందుకు సిద్ధంగా ఉండండి. చనిపోయిన చిన్నారుల ప్రతి రక్తపుబొట్టుకు ప్రతీకారం తీర్చుకుంటాం’ అని ఆ ట్వీట్లలో షరీఫ్ తీవ్రవాదులను హెచ్చరించారు. మరోవైపు.. ముంబై దాడి కేసులో ప్రధాన సూత్రధారి లఖ్వీకి పాక్ తీవ్రవాద వ్యతిరేక కోర్టు బెయిల్ మంజూరు చేయడం గమనార్హం. 

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments