Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోహినూర్... భారతదేశానికి చెందినదే...! మోదీకి ఇచ్చి పంపండి...!! బ్రిటన్ ఎంపి వినతి

Webdunia
బుధవారం, 29 జులై 2015 (09:09 IST)
భారతదేశం నుంచి కోహినూర్ వజ్రాన్ని అప్పట్లో బ్రిటీష్ పాలకులు తీసుకువచ్చారు. దానిని తిరిగి ఆ దేశానికి ఇచ్చేయడం న్యాయం.. వారి సంపదను వారికిచ్చి మన దేశ గౌరవాన్ని నిలుపుకోవాలని బ్రిటన్‌కు చెందిన ఓ ఎంపి ఆ దేశ ప్రభుత్వానికి విన్నివించారు. మోదీ రాక సందర్భంగా దానిని అప్పగించి భారతదేశంతో మంచి సంబంధాలను ఏర్పచుకోవాలని ఆయన అక్కడి ప్రభుత్వాన్ని కోరారు. వివరాలిలా ఉన్నాయి.
 
బ్రిటిష్ పాలకులు వెళుతూ.. వెళుతూ..భారతదేశం నుంచి అత్యంత విలువైన ‘కోహినూర్’ వజ్రాన్ని వారి దేశానికి తీసుకెళ్ళి పోయారు. ఆ తర్వాత దశాబ్దాల పాటు ఆ వజ్రం అక్కడే ఉండిపోయింది. కోహినూర్‌ను వెనక్కు తీసుకొచ్చేందుకు భారతీయులు ప్రయత్నాలు చేశారు. అవేవి ఫలించలేదు. తాజాగా భారత సంతతికి చెందిన బ్రిటన్ ఎంపీ కీత్ వేజ్ మరోమారు ఈ తరహా యత్నానికి శ్రీకారం చుట్టారు. 
 
భారత్‌కు చెందిన కోహినూర్ వజ్రాన్ని ఆ దేశానికే ఇచ్చేయాలని కీత్ వేజ్ బ్రిటన్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ ఏడాది నవంబర్‌లో బ్రిటన్ రానున్న భారత ప్రధాని నరేంద్ర మోదీకి కోహినూర్‌ను ఇచ్చి పంపాలని ఆయన కోరారు. ఎంత వరకూ సఫలమవుతుందో వేచి చూడాలి. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments