Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇండియన్ టెక్కీలకు ముచ్చెమటలు... అమెరికా సభకు హెచ్1 బీ వీసాల సంస్కరణ బిల్లు

అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన డోనాల్డ్ ట్రంప్ అనుకున్నంత పనిచేస్తున్నారు. తన ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు ఆయన హెచ్1 బి వీసాల సంస్కరణల బిల్లును అమెరికా కాంగ్రెస్ సభలో ప్రవేశపెట్టారు.

Webdunia
మంగళవారం, 31 జనవరి 2017 (13:21 IST)
అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన డోనాల్డ్ ట్రంప్ అనుకున్నంత పనిచేస్తున్నారు. తన ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు ఆయన హెచ్1 బి వీసాల సంస్కరణల బిల్లును అమెరికా కాంగ్రెస్ సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లుకు కాంగ్రెస్ ఆమోద ముద్రవేస్తే అమెరికా పని చేసే విదేశీ టెక్కీలు పెను కష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాగే, అనేక భారతీయ కంపెనీలు తమ షట్టర్లు మూసుకోవాల్సిన నిర్బంధ పరిస్థితి ఏర్పడనుంది. 
 
భారత టెక్నాలజీ కంపెనీలు అత్యధికంగా వాడుతున్న హెచ్1 బీ వీసాలను గణనీయంగా తగ్గించడంతో పాటు, కఠిన నిబంధనలు విధిస్తూ, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌ను తయారు చేశారు. దీనిపై ట్రంప్ సంతకం పెట్టనున్నారు. ఈ వార్త భారత టెక్కీల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. ప్రతి యేటా అమెరికా 85 వేల హెచ్1 బీ వీసాలను ఇస్తుండగా, ఇందులో సింహభాగాన్ని అంటే, దాదాపు 80 శాతానికి పైగా వీసాలు భారత్‌కే దక్కుతున్నాయి. 
 
ప్రస్తుతం 60 వేల డాలర్ల వేతనం కలిగిన వారికి హెచ్1 బీ వీసాలు జారీ చేసే అవకాశం ఉంది. ఈ పరిమితిని ప్రస్తుతం కనిష్టంగా లక్షా 30 వేల డాలర్లకు పెంచారు. అంటే ఇంత మొత్తంలో వేతనం కలిగిన వారికి మాత్రమే ఈ వీసాలను జారీ చేస్తారు. వాస్తవానికి భారతీయ టెక్కీలంతా అతి తక్కువ వేతనానికి పని చేస్తున్న విషయం తెల్సిందే. అందువల్ల వీసా సంస్కరణల బిల్లుకు ఆమోదం తెలిపినట్టయితే ఆ ప్రభావం గరిష్టంగా భారత టెక్కీలపైనే చూపనుంది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments