Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కుతున్న గ్రీస్.. ప్రజలపై భారం...

Webdunia
మంగళవారం, 21 జులై 2015 (13:08 IST)
గ్రీస్ దేశం ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కనుంది. అంతర్జాతీయ సమాజంలో దృష్టిని చెడ్డపేరు తెచ్చుకోకుండా ఉండేందుకు వీలుగా కఠిన నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగేందుకు సిద్ధమైంది. ఇందులోభాగంగా ప్రజలపై భారీగా భారం మోపనుంది. గ్రీస్ సర్కారు అంగీకరించి విలువ ఆధారిత పన్నులను ప్రస్తుతమున్న 13 శాతం నుంచి ఏకంగా 23 శాతానికి పెంచింది. దీంతో ప్రజల నుంచి వచ్చే విమర్శలు ఎలాగున్నా, ఖజానాకు నిధులు సమకూరే మార్గం దగ్గరైంది. 
 
ప్రజా రవాణా వ్యవస్థ నుంచి ఆహార పదార్థాల వరకూ ధరలు పెరిగాయి. గ్రీస్ ప్రజల్లో అత్యధికులు ఈ సంస్కరణలకు 'నో' చెప్పినప్పటికీ, ప్రపంచం ముందు చెడ్డపేరు తెచ్చుకోకూడదన్న ఉద్దేశంతో కఠిన నిర్ణయాల అమలుకే గ్రీస్ ప్రధాని అలెక్సిస్ మొగ్గు చూపారు. అలాగే, గతంలో తీసుకున్న డబ్బును తిరిగి చెల్లించే పని మొదలు పెట్టింది. మూడు వారాల తర్వాత బ్యాంకులను తెరిపించింది. 
 
గతవారం ఉద్దీపన సంస్కరణల కొత్త ప్యాకేజీకి ఓకే చెప్పిన గ్రీస్, 2 బిలియన్ యూరోలు (సుమారు రూ. 13,600 కోట్లు) రుణ దాతలకు తిరిగి చెల్లించింది. ప్రజలపై పన్నుల భారం మోపేందుకు బ్యాంకులు తెరచుకోగానే వేలాది మంది డబ్బు డ్రా చేసుకునేందుకు క్యూలు కట్టారు. వారానికి కేవలం 420 యూరోలను మాత్రమే బ్యాంకుల నుంచి విత్ డ్రా చేసుకోవాలన్నారు. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments