Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇండోనేషియాలో భారతీయుడికి మరణశిక్ష.. రక్షించేందుకు కేంద్రం యత్నాలు

అక్రమ మాదకద్రవ్యాల కేసులో దోషిగా తేలిన ఓ భారతీయుడికి ఇండోనేషియా కోర్టు ఉరిశిక్ష విధించింది. ప్రస్తుతం ఈ దోషిని రక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆ దోషి పేరు గుర్‌దీవ్ సింగ్.

Webdunia
శుక్రవారం, 29 జులై 2016 (10:41 IST)
అక్రమ మాదకద్రవ్యాల కేసులో దోషిగా తేలిన ఓ భారతీయుడికి ఇండోనేషియా కోర్టు ఉరిశిక్ష విధించింది. ప్రస్తుతం ఈ దోషిని రక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆ దోషి పేరు గుర్‌దీవ్ సింగ్. 
 
ఈయన 2004లో గుర్‌దీప్ 300 గ్రాముల హెరాయిన్‌తో జకార్తా అంతర్జాతీయ విమానాశ్రయంలో పట్టుబడ్డాడు. డ్రగ్స్ కేసులో సింగ్, ఓ మహిళ సహా మొత్తం 14 మందికి అక్కడి ప్రభుత్వం మరణశిక్ష విధించింది. విషయం తెలిసిన భారత ప్రభుత్వం గుర్‌దీప్‌ను రక్షించేందుకు చర్యలు చేపట్టింది. 
 
సింగ్‌కు క్షమాభిక్ష ప్రసాదించాలని కోరుతూ ఇండోనేషియా అధ్యక్షుడి వద్ద పిటిషన్ దాఖలు చేసింది. ఇండోనేషియాలోని తమ దౌత్య అధికారులు అక్కడి అధికారులతో టచ్‌లో ఉన్నారని, అలాగే గుర్‌దీప్ భార్య, సోదరులను కలిసి మాట్లాడుతున్నారని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ తెలిపారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం