Webdunia - Bharat's app for daily news and videos

Install App

షాకింగ్ న్యూస్: హెడ్‌ ఫోన్స్ చెవుల్లోనే కరిగిపోయాయి.. యువతి మృతి.. ఎక్కడ?

స్మార్ట్ ఫోన్స్‌తో కాలం గడుపుతూ.. హెడ్ ఫోన్స్ వాడుతున్నారా? అయితే జాగ్రత్త. ఎందుకంటే... హెడ్ ఫోన్స్ వాడేవారిని వణికించే దుర్ఘటన బ్రెజిల్‌లో చోటుచేసుకుంది. ఫోన్‌ఛార్జింగ్‌లో వుండగానే.. హెడ్ ఫోన్ ద్వారా

Webdunia
గురువారం, 22 ఫిబ్రవరి 2018 (13:06 IST)
స్మార్ట్ ఫోన్స్‌తో కాలం గడుపుతూ.. హెడ్ ఫోన్స్ వాడుతున్నారా? అయితే జాగ్రత్త. ఎందుకంటే... హెడ్ ఫోన్స్ వాడేవారిని వణికించే దుర్ఘటన బ్రెజిల్‌లో చోటుచేసుకుంది. ఫోన్‌ఛార్జింగ్‌లో వుండగానే.. హెడ్ ఫోన్ ద్వారా ఫోన్ మాట్లాడిన ఓ యువతి ప్రాణాలు కోల్పోయింది.
 
వివరాల్లోకి వెళితే.. లూయిసా పిన్హిరో (17) అనే యువతి.. హై వోల్టేజ్ విద్యుత్ కారణంగా హెడ్ ఫోన్స్ పేలిపోవడంతో మరణించింది. ఫోన్ ఛార్జ్‌లో పెట్టింది. అంతటితో ఆగకుండా ఫోన్‌లో హెడ్ ఫోన్ ద్వారా మాట్లాడింది. చివరికి ఎలక్ట్రిక్ షాక్‌ తగిలి అపస్మారక స్థితికి చేరింది. 
 
లూయిసాను తల్లిదండ్రులు ఆస్పత్రికి తరలించినా.. ఫలితం లేకపోయిది. అప్పటికే ఆ యువతి ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధారించారు. విద్యుదాఘాతానికి హెడ్ ఫోన్స్ చెవుల్లోనే కరిగిపోయినట్లు వైద్యులు తెలిపారు. ఫోన్ ఛార్జింగ్‌లో వున్నప్పుడు వాటిని వాడకుండా వుండాలని హెచ్చరించినా.. వాటిని వినియోగదారులు పట్టించుకోవట్లేదని.. తద్వారా ఇలాంటి అనర్థాలు చోటుచేసుకుంటున్నాయని వైద్యులు చెప్తున్నారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments