Webdunia - Bharat's app for daily news and videos

Install App

'అల్లాహో అక్బ‌ర్' అంటూ గొడ్డలి - కత్తులతో దాడి.. జర్మనీలో ఆప్ఘన్ టీనేజ్ శరణార్థి బీభత్సం!

జర్మనీలోని వుర్జ్‌బుర్గ్‌ నగరంలో ఓ ఆఫ్గాన్‌ యువకుడు బీభత్సం సృష్టించాడు. రైల్లోకి చొరబడి ప్రయాణికులపై గొడ్డలి, కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడినట్లు అధికారులు తెలిపారు.

Webdunia
మంగళవారం, 19 జులై 2016 (10:31 IST)
జర్మనీలోని వుర్జ్‌బుర్గ్‌ నగరంలో ఓ ఆఫ్గాన్‌ యువకుడు బీభత్సం సృష్టించాడు. రైల్లోకి చొరబడి ప్రయాణికులపై గొడ్డలి, కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడినట్లు అధికారులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
 
త్రెచ్లింజెన్‌ - వుర్జ్‌బుర్గ్‌ మధ్య నడిచే రైలులో బవేరియా సమీపంలో 17 ఏళ్ల ఆఫ్గాన్‌ యువకుడు చొరబడి ప్రయాణికులపై కత్తి, గొడ్డలితో దాడిచేశాడు. అనంతరం రైలు నుంచి పారిపోయేందుకు ప్రయత్నించాడు. దీంతో అతన్ని పోలీసులు కాల్చి చంపారు. యువకుడి వివరాలను పోలీసులు వెల్లడించలేదు. దాడికి గల కారణాలపై విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఈ దాడికి పాల్పడింది టీనేజ్ ఆఫ్ఘ‌న్ శ‌ర‌ణార్థిగా గుర్తించారు. 
 
టీనేజ‌ర్ దాడి వ‌ల్ల షాక్‌కు గురైన ప్ర‌యాణికుల‌కు చికిత్స‌ను అందించారు. 17 ఏళ్ల ఆఫ్ఘ‌న్ యువ‌కుడు ఒచ్‌సెన్‌ఫోర్ట్ ప‌ట్ట‌ణంలో నివ‌సిస్తున్న‌ట్లు ఆ రాష్ట్ర మంత్రి తెలిపారు. అల్లాహో అక్బ‌ర్ అంటూ యువ‌కుడు దాడికి పాల్ప‌డిన‌ట్లు ప్ర‌త్య‌క్ష సాక్షులు తెలిపారు. ప్ర‌యాణికుల‌పై దాడి చేసి పారిపోతున్న టీనేజ‌ర్‌ను పోలీసులు వెంటాడి కాల్చి చంపారు.

దేవర ఫియర్ సాంగ్ వర్సెస్ పుష్ప సాంగ్.. జరగండి అంటోన్న చెర్రీ

కనీసం నా పిల్లలతో చాక్లెట్ పార్టీకి కూడా తీరికలేదు, రేవ్ పార్టీనా?: జానీ మాస్టర్ - video

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పైన రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్‌కు ఫిర్యాదు

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments