Webdunia - Bharat's app for daily news and videos

Install App

జర్మనీలో ఏకంగా కరోనా థర్డ్ వేవ్.. ఏప్రిల్ 18 వరకు లాక్ డౌన్‌

Webdunia
మంగళవారం, 23 మార్చి 2021 (09:39 IST)
ప్రపంచంలో కరోనా మళ్ళీ విజృంభిస్తోంది. కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. యూరప్ దేశాల్లో పరిస్థితులు ఇప్పటి వరకు అదుపులోకి రాలేదు. ఇంగ్లాండ్‌లో జులై వరకు లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. అయితే, ఇప్పుడు జర్మనీలో ఏకంగా కరోనా థర్డ్ వేవ్ కొనసాగుతోంది. 
 
థర్డ్ వేవ్ కావడంతో జాగ్రత్తలు తీసుకోవాలని జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మోర్కెల్ పేర్కొన్నారు. ఏప్రిల్ 18 వరకు లాక్ డౌన్‌ను పొడిగిస్తున్నట్టు ఛాన్సలర్ పేర్కొన్నారు. ఆర్థికంగా ఇబ్బందులు వస్తున్నా ప్రజల ప్రాణాలు కాపాడటం ముఖ్యమని, అందుకే లాక్ డౌన్ నిర్ణయం తీసుకున్నట్టు మోర్కెల్ పేర్కొన్నారు.
 
మరోవైపు జర్మనీ వ్యాప్తంగా ఏడు రోజుల వ్యవధిలో కరోనా పాజిటివ్ కేసులు 107శాతం మేర నమోదయ్యాయి. 68 వారాల తరువాత ఈ స్థాయిలో కరోనా కేసులు రికార్డ్ కావడం ఇదే తొలిసారి. 16 రాష్ట్రాల్లో కరోనా తీవ్రత అత్యధికంగా ఉంటోంది.
 
ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని సంపూర్ణ లాక్‌డౌన్‌ను విధించాల్సి వచ్చిందని ఏంజెలా మెర్కెల్ తెలిపారు. ఆయా రాష్ట్రాల స్థానిక ప్రభుత్వాధినేతలు, ఉన్నతాధికారులతో సమావేశమైన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. వారిని సంప్రదించిన తరువాతే కంప్లీట్ లాక్‌డౌన్ విధించామని చెప్పారు.

సంబంధిత వార్తలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments