Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐఎస్ఐఎస్‌ చేతిలో చిక్కుకున్న భారతీయులు: వీరిలో ఇద్దరు తెలుగు వారు కూడా..?

Webdunia
శుక్రవారం, 31 జులై 2015 (12:57 IST)
భారతీయులంతా లిబియా విడిచి రావాలని గత సంవత్సరమే కేంద్ర ప్రభుత్వం సూచించినప్పటికీ, ఇంకా వందల సంఖ్యలో భారతీయులు అక్కడే ఉండటం కొంప ముంచింది. లిబియాలో ట్రిపోలీలో టీచర్స్‌గా పనిచేస్తున్న వారిని ఐఎస్ఐఎస్ టెర్రరిస్టులు అపహరించారు. వీరిలో నలుగురు భారతీయులుండగా, మరో ఇద్దరు తెలుగువారు కూడా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. కిడ్నాపైన వారిలో తెలుగువారైన హైదరాబాదుకు చెందిన గోపీకృష్ణ, శ్రీకాకుళానికి చెందిన బలరాం ఉన్నట్టు విదేశాంగ శాఖ ప్రకటించింది. 
 
మిగతావారిలో ఒకరు రాయచూరు, మరొకరు బెంగళూరు ప్రాంతాలకు చెందిన వారని, వీరిలో ముగ్గురు యూనివర్శిటీ ఆఫ్ సిథ్‌లో ఫ్యాకల్టీ సభ్యులుగా ఉన్నారని, మరొకరు జుఫ్రాలోని వర్శిటీ శాఖలో పనిచేస్తున్నారని విదేశాంగ శాఖ ప్రతినిధులు తెలిపారు. వీరంతా ఇండియాకు తిరిగొచ్చే నిమిత్తం విమానాశ్రయానికి వెళుతుంటే, ఓ చెక్ పోస్టు వద్ద పట్టుకొని కిడ్నాప్ చేశారని పేర్కొన్నారు. వీరి ఆచూకీ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నామని... వీరిని అపహరించడం వెనుక ఉగ్రవాదుల ఉద్దేశమేమిటో కూడా తెలియదని విదేశాంగ శాఖ ప్రతినిధులు వెల్లడించారు.

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments