Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆప్ఘనిస్థాన్‌లో భారీ వరదలు.. 50మంది మృతి

Webdunia
శుక్రవారం, 7 మే 2021 (10:07 IST)
ఆప్ఘనిస్థాన్‌లో భారీ వరదలు ముంచెత్తాయి. భారీ వర్షాలు, వరదల ఉధృతికి 50 మంది మృత్యువాత పడ్డారు. దేశంలోని 17 ప్రావిన్సులలో భారీవర్షాలు, వరదల వల్ల 50 మంది వరకు మంది మృతిచెందారని ఆ దేశ నేషనల్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ ఒక ప్రకటనలో వెల్లడించింది. వరదల్లో మరో 15 మంది గల్లంతు కాగా.. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. వరదల వల్ల 2,450 వరకు పశువులు మృత్యువాత పడ్డాయి.
 
అలాగే వరదల తాకిడికి 460 కుటుంబాల వరకు నిరాశ్రయులయ్యారు. దేశంలో మృతుల కుటుంబాలకు రూ.50వేలు, క్షతగాత్రులకు రూ.25వేలు ఇస్తామని ఆఫ్ఘన్ సర్కారు ప్రకటించింది. విపత్తు నిర్వహణ కమిటీలు వరద బాధిత కుటుంబాలకు సాయం చేస్తున్నాయి.
 
బాధిత కుటుంబాలకు ఆహారం, ఆహారేతర సహాయాలు పంపిణీ చేస్తున్నాయి. ఈ హెరాత్ ప్రావిన్స్‌లో 22 మంది మృతి చెందారు. హెరాత్ తరువాత పొరుగున ఉన్న ఘోర్ ప్రావిన్స్ ఎక్కువగా ప్రభావితమైందని ఆఫ్ఘనిస్తాన్ టైమ్స్ నివేదించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎవర్‌గ్రీన్‌ స్టైల్‌ ఐకాన్‌ చిరంజీవి - హాటెస్ట్‌ స్టార్‌ ఆఫ్‌ ది ఇయర్‌ నాని

అల్లు అర్జున్‌కు చుక్కలు చూపించిన ఎయిర్‌పోర్టు సెక్యూరిటీ (Video)

కుమార్తెకు సెక్స్ టాయ్ బహుమతిగా ఇవ్వాలని భావించాను : నటి గౌతమి

రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్ మేబి, అర్మాన్ మలిక్, ఇక్కాలతో హిప్-హాప్

Megastar Chiranjeevi: సినీ కార్మికుల సమస్యలపై మెగాస్టార్ చిరంజీవి సంచలన ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

గౌరవ్ గుప్తా తన బ్రైడల్ కౌచర్ కలెక్షన్, క్వాంటం ఎంటాంగిల్‌మెంట్ ఆవిష్కరణ

Business Ideas: మహిళలు ఇంట్లో వుంటూనే డబ్బు సంపాదించవచ్చు.. ఎలాగో తెలుసా?

Javitri for Skin: వర్షాకాలంలో మహిళలు జాపత్రిని చర్మానికి వాడితే..?.. ఆరోగ్యానికి కూడా?

తర్వాతి కథనం
Show comments