పావురం వాలిన పాపానికి కేసు నమోదు.. పాకిస్థాన్ సరిహద్దుల్లో..?

Webdunia
బుధవారం, 21 ఏప్రియల్ 2021 (12:52 IST)
Pigeon
అంతర్జాతీయ సరిహద్దులో ఓ అనుమానాస్పద పావురాన్ని పట్టుకొని దానిపై కేసు నమోదు చేశారు. పంజాబ్‌లోని బీఓపీ రోరన్‌వాలా దగ్గర కానిస్టేబుల్ నీరజ్ కుమార్ విధుల్లో ఉన్న సమయంలో ఓ పావురం వచ్చి అతనిపై వాలింది. దాని కాళ్లకు ఓ పేపర్ కట్టి ఉన్నట్లు గుర్తించారు. పాక్ సరిహద్దుకు 500 మీటర్ల దూరంలో ఈ నెల 17న ఈ ఘటన జరిగింది.
 
తనపై పావురం వాలిన వెంటనే ఆ కానిస్టేబుల్ దానిని పట్టుకున్నాడు. విషయాన్ని పోస్ట్ కమాండర్ ఓంపాల్ సింగ్‌కు విషయాన్ని వెల్లడించగా వెంటనే దానికి స్కానింగ్ నిర్వహించారు. దాని కాలికి కట్టి ఉన్న పేపర్‌పై ఓ నంబర్ రాసి ఉంది. 
 
ఈ ఘటనపై అమృత్‌సర్‌లోని కహాగఢ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. గతేడాది మేలో జమ్ముకశ్మీర్‌లోని కథువాలో పాకిస్థాన్‌లో నిఘా కోసం శిక్షణ పొందినట్లు అనుమానిస్తున్న ఓ పావురాన్ని ఇలాగే పట్టుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమంత రెండో భర్త రాజ్ నిడుమోరు నేపథ్యం ఏంటి?

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య చిత్రం ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్

Varun Sandesh: వ‌రుణ్ సందేశ్ న‌య‌నం ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌

MB50: రజనీ కాంత్ సహా ప్రముఖుల సమక్షంలో ఘనంగా మోహన్ బాబు 50 వేడుకలు

బాలీవుడ్‌లో మిల్కీ బ్యూటీకి బంపర్ ఆఫర్?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments