Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్ కోర్టులో 'పరువు' పోయింది... అడ్డూఅదుపులేని పరువు హత్యలు

Webdunia
మంగళవారం, 24 జనవరి 2023 (12:14 IST)
పాకిస్థాన్ దేశంలో పరువు హత్యలకు అడ్డూఅదుపు లేకుండా పోయింది. తాజాగా మరో హత్య జరిగింది. ఇది సాక్షాత్ కోర్టు హాలులోనే జరిగింది. తనను ఎదిరించి వైద్యుడిని వివాహం చేసుకున్న కుమార్తెను కన్నతండ్రి కోర్టులోనే తుపాకీతో కాల్చి చంపేశాడు. దీంతో ఆ యువతి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన పాకిస్థాన్ ప్రధాన ఓడరేవు నగరమైన కరాచీలో జరిగింది. 
 
నగరంలోని పిరాబాద్‌కు చెందిన ఓ యువతి తన తల్లిదండ్రులను ఎదిరించి తన ఇష్టపూర్వకంగా వైద్యుడిని ప్రేమ పెళ్లి చేసుకుంది. ఈ పెళ్లిని ఆ యువతి తల్లిదండ్రులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ క్రమంలో తన వాంగ్మూలాన్ని నమోదు చేసేందుకు ఆ యువతి కరాచీ సిటీ కోర్టుకు వచ్చింది. దీన్ని జీర్ణించుకోలేని తండ్రి కుమార్తెపై తుపాకీతో కాల్పులు జరిపాడు. దీంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. 
 
తాజాగా ఘటనలో యువతి తన ఇష్టప్రకారం పెళ్ళి చేసుకున్న తర్వాత ఇంటి నుంచి వెళ్లిపోయిందని, ఇదే తండ్రి ఆగ్రహానికి కారణమని పోలీసులు పేర్కొన్నారు. అంతేకాకుండా, దేశంలో జరుగుతున్న పరువు హత్యల వెనుక తండ్రి, భర్త, సోదరుడు లేదంటే కుటుంబ సభ్యుడో ఉంటున్నారని పోలీసులు చెబుతున్నారు. 
 
కాగా, పరువు హత్యల పేరుతో పాకిస్థాన్‌లో అనేక మంది దారుణ హత్యలకు గురవుతున్నారు. మృతుల్లో ఎక్కువ మంది మహిళలే ఉంటున్నారని పాకిస్థాన్ మానవ హక్కుల సంస్థ తెలిపింది. గత దశాబ్దకాలంలో ఏడాదికి సగటున 650 మంది పరువు హత్యలు జరిగినట్టు తెలిపింది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments