జపాన్ దేశంలో ఖరీదైన ‘ద్రాక్ష’

Webdunia
శుక్రవారం, 24 సెప్టెంబరు 2021 (22:15 IST)
స్వచ్ఛమైన బంగారం పూతనుపయోగించి చేస్తోన్న  వంటలు ఇటీవలి కాలంలో ప్రసిద్ధి చెందుతోన్న విషయం తెలిసిందే. బిర్యానీ, ఐస్ క్రీం,  వడ పావ్ వంటి పలు రకాల  ఆహారపదార్ధాలు అత్యంత ఖరీదైనవిగా తయారు చేస్తున్నారు. ఇప్పుడు ఈ కోవలోకి ‘ద్రాక్ష’ కూడా చేరింది. జపాన్ దేశంలో ఓ రకానికి చెందిన ద్రాక్ష ఒక గుత్తి ఖరీదు... భారత కరెన్సీలో రూ. 30 వేల వరకూ ఉంటోంది.
 
 
జపాన్‌లో  రూబీ రోమన్‌ ద్రాక్ష రకాన్ని పండిస్తుంటారు. ఈ ద్రాక్ష ఖరీదు గుత్తి  రూ. 30-రూ. 35 వేల వరకు ఉంటోంది. ఇక... ఖరీదుకు తగ్గట్టే ఈ ద్రాక్ష మాములు ద్రాక్ష కంటే నాలుగు రేట్లు పెద్దదిగా ఉంటుండడంతో దీనిని ప్రత్యేకంగా పరిగణిస్తారు. అంతేకాదు... ఈ ద్రాక్ష రంగు, రుచి కూడా వివిభిన్నంగా ఉంటాయి. ఇక రూబీ  రోమన్ ద్రాక్ష చాలా అరుదుగా దొరకడం వల్ల కూడా దీనికి అంత డిమాండ్‌ ఏర్పడిందని చెబుతుంటారు. 

ద్రాక్షగుత్తిలో ఒక్కో పండు కనీసం 20 గ్రాముల బరువు, 30 మి.మీ. పరిమాణం ఉంటుంది. ఇక... నిరుడు ఓ గుత్తిని అమ్మితే రూ. 8.8 లక్షల వరకు( 12వేల డాలర్లు) పలికడం విశేషం.  తాజాగా ఇప్పుడు కూడా ఈ ద్రాక్ష అధిక ధరకు అమ్ముడై తనదైన ఒరవడిని కొనసాగిస్తోంది. జపాన్‌లో మాత్రమే పండే రూబీ రోమన్‌ రకం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ద్రాక్షగా ప్రత్యేకత చాటుకుంటోంది. ఈ ద్రాక్షను అత్యంత విలాసవంతమైనదిగా,  ఖరీదైనదిగా చెబుతుంటారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వేధింపులు ధైర్యంగా ఎదుర్కోండి.. మహిళలకు ఐష్ పిలుపు

ఇకపై చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌కు విదేశీ విరాళాలు

Naveen Polishetty : భీమవరం బల్మా గీతంతో గాయకుడిగా అదరగొట్టిన నవీన్‌ పొలిశెట్టి

Manoj: కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు : మంచు మనోజ్

అశ్విని దత్ ప్రజెంట్స్ లో జయకృష్ణ ఘట్టమనేని చిత్రం శ్రీనివాస మంగాపురం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

తర్వాతి కథనం
Show comments