Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎలాన్ మస్క్ సైబర్ ట్యాక్సీ ఇదే.. ఎంతమంది ప్రయాణం చేయొచ్చు?

ఠాగూర్
శుక్రవారం, 11 అక్టోబరు 2024 (12:25 IST)
టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కంపెనీ తయారు చేసిన సైబర్ ట్యాక్సీ సిద్ధమైంది. టెస్లా వీరోబో షోలో కొత్త వాహనాలను ప్రదర్శించారు. ఇందులో ఈ సైబర్ ట్యాక్సీని కూడా ప్రదర్శించారు. ఎలాన్ మస్క్‌కు చెందిన సంస్థ రూపొందించిన రోబో వ్యాన్‌ను వీరోబో (రోబోట్ ఈవెంట్) కార్యక్రమంలో హఠాత్తుగా ప్రదర్శించారు. కాలిఫోర్నియాలోని వార్నర్ బ్రదర్స్ ప్రాంగణంలో ఈ షోను నిర్వహించారు. రోబోవ్యాన్ సాధారణ డిజైన్లకు పూర్తి భిన్నంగా ఉంది. అది రైలు ఇంజిన్ వంటి డిజైన్‌‍లో దానిని రూపొందించారు. దీని చక్రాలు బయటకు కనిపించకపోవడం విశేషం. దీన్ని 20 మంది ప్రయాణికులను లేదా సరకులను తరలించేందుకు వాడొచ్చని సంస్థ తెలిపింది. 
 
ఈ వ్యాను మైలుదూరం ప్రయాణించడానికి 5 నుంచి 10 సెంట్ల ఖర్చు అవుతుందని టెస్లా బృందం పేర్కొంది. దీనిని అటానమస్ సెల్ఫ్ డ్రైవింగ్ కోసం నిర్మించినట్టు వెల్లడించింది. దీంతో టెస్లా మాస్ ట్రావెల్ సెగ్మెంట్లలో కూడా ఇది ప్రవేశించనట్టయింది. ఇప్పటివరకు ఈ సంస్థ వాహనాల లైనప్ కేవలం చిన్నవాటికే పరిమితమైంది. 
 
ఇక రోబో ట్యాక్సీని కూడా ఎలాన్ మస్క్ ఆవిష్కరించారు. రెండు డోర్లతో ఉన్న ఈ కారు స్టీరింగ్ వీల్, పెడల్స్ లేవు. దానిని మస్క్ క్యాబ్ అని ప్రేక్షకులకు పరిచయం చేశారు. దీని తయారీ 2026 నుంచి మొదలవుతుందని పేర్కొన్నారు. దీనిని వినియోగదారులు 30 వేల డాలర్ల కంటే తక్కువకే కొనుగోలు చేయొచ్చని పేర్కొన్నారు. ప్రతీ మైలు ప్రయాణానికి 20 సెంట్లు ఖర్చవుతుందని, అటానమస్ కార్లను సాధారణంగా వాహనాల కంటే 5 నుంచి 10 రెట్లు అదనంగా వాడొచ్చని మస్క్ వెల్లడించారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments