Webdunia - Bharat's app for daily news and videos

Install App

జీ-7 సదస్సు: భారత ప్రతినిధుల్లో ఇద్దరికి కరోనా.. స్వీయ నిర్భంధంలో..?

Webdunia
బుధవారం, 5 మే 2021 (15:44 IST)
జీ-7 సదస్సులో పాల్గొనేందుకు లండన్ వెళ్లిన భారత ప్రతినిధుల్లో ఇద్దరికి కరోనా సోకింది. ఈ నేపథ్యంలో ప్రతినిధుల బృందంలోని సభ్యులంతా స్వీయ ఐసొలేషన్‌లో ఉన్నట్లు బ్రిటన్ ప్రభుత్వం బుధవారం తెలిపింది. 
 
జీ 7 గ్రూప్‌లో భారత్ సభ్య దేశం కాదు. అయినప్పటికీ లండన్‌ జరిగే ఈ సదస్సుకు భారత్‌తోపాటు ఆస్టేల్రియా, దక్షిణ ఆఫ్రికా, దక్షిణ కొరియా దేశాలను బ్రిటన్ ఆహ్వానించింది. దీంతో కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్‌తో కూడిన భారత ప్రతినిధుల బృందం లండన్‌కు వెళ్లింది.
 
మరోవైపు కరోనా నేపథ్యంలో ప్రతినిధులకు ప్రతి రోజు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత ప్రతినిధుల్లో ఇద్దరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో వారందరినీ స్వీయ ఐసొలేషన్‌లో ఉంచినట్లు బ్రిటన్ ప్రభుత్వం తెలిపింది.
 
భారత ప్రతినిధులు వర్చువల్‌గా సదస్సులో పాల్గొంటారని పేర్కొంది. అయితే కేంద్ర మంత్రి జైశంకర్‌కు కరోనా సోకలేదని వెల్లడించింది. కాగా, ఆయన బ్రిటన్ అంతర్గత మంత్రితో మంగళవారం సమావేశమైనట్లు స్థానిక మీడియా పేర్కొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ టైటిల్ చెన్నై లవ్ స్టోరీ

Nidhhi Agerwal: శింబుతో నిధి అగర్వాల్ ప్రేమాయణం.. పవన్ బ్యూటీ ఏం చెప్పిందంటే?

'హరిహర వీరమల్లు' ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎపుడు.. ఎక్కడ?

పవన్ కళ్యాణ్ సినిమాకు టిక్కెట్ రేట్లు పెంచండి... ఏఎం రత్నం వినతి

హరిహరవీరమల్లు టికెట్ ధర ఆమోదం కోరుతూ ఛాంబర్ కి అభ్యర్థన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments