Webdunia - Bharat's app for daily news and videos

Install App

20 మంది భారతీయులతో ప్రయాణిస్తున్న వాణిజ్య నౌకపై డ్రోన్ దాడి

Webdunia
ఆదివారం, 24 డిశెంబరు 2023 (08:36 IST)
అరేబియా సముద్రంలో 20 మంది భారతీయ ప్రయాణికులతో వెళుతున్న నౌకపై శనివారం డ్రోన్ దాడి జరిగింది. ఎంవీ కెమ్ ఫ్లూటో అనే వాణిజ్య నౌకలో ప్రయాణిస్తున్న ప్రయాణికులపై ఈ దాడి జరిగింది. ఈ ద్రోన్ దాడిలో ఓ ఒక్కరూ గాయపడలేదని అధికారులు వెల్లడించారు. గుజరాత్ రాష్ట్రంలోని పోరుబందర్‌ పోర్టుకు 217 నాటికల్ మైళ్ళ దూరంలో ఈ దాడి జరిగినట్టు గుర్తించారు. దాడి తర్వాత నౌకలో పేలుడు సంభవించి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అయితే, ఎలాంటి ప్రాణనష్టం వాటిల్లలేదని భారతీయ నౌకాదళ అధికారులు వెల్లడించారు. విషయం తెలుసుకున్న వెంటనే సముద్ర గస్తీ డోర్నియర్ రంగంలోకి దాడికి గురైన ఎంవీ కెమ్ ఫ్లూటో నౌకతో కమ్యూనికేషన్ సంబంధాలను తిరిగి పునరుద్ధరించిందని వెల్లడించారు.
 
ఈ దాడికి గురైన నౌకలోని మర్చంట్ షిప్ సౌదీ అరేబియాలోని ఓ పోర్టు నుంచి క్రూడాయిల్‌తో మంగళురు బయలుదేరిందని అధికారులు చెప్పారు. ఇండియన్ ఎక్స్‌క్లూజివ్ ఎకనామిక్ జోన్‌లో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న కోస్ట్ గార్డ్ షిప్ ఐసీజీఎస్ విక్రమ్ దాడికి గురైన కెమ్ ప్లూటో దిశగా కలిది వెళుతుందని అధికారులు వెల్లడించారు. దాడికి గురైన నౌక సహాయం అందించాలని ఆ ప్రాంతంలోని నౌకలన్నింటికీ సమాచారం అందించని వారు వెల్లడించారు. అయితే, ఎంపీ ఫ్లూట నౌక 11 నాటికన్ మైళ్ల వేగంతో వెళుతుండటంతో ఇతర నౌకలు సాయం అందించలేక పోయాయని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జార్జియాలో "అఖండ-2" మూవీ షూటింగ్

Sugar Baby: నటి త్రిష కృష్ణన్‌పై ట్రోల్స్.. కారణం ఏంటంటే?

'ఆయన కొడుకు వచ్చాడని చెప్పు' ... మంచు మనోజ్ ఆసక్తికర ట్వీట్

Bhairavam Review: భైరవం సినిమా ఎలా ఉందో తెలుసా..!

పచ్చని జీవితంలో నిప్పులు పోసిన కేన్సర్: టీవీ నటి దీపిక కాకర్‌కు లివర్ కేన్సర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

తర్వాతి కథనం
Show comments